మంచు వారి కలల సినిమా కన్నప్ప విడుదలకు కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ సందర్భంగా ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు మంచు విష్ణు. బుధవారమే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశామని.. ఒక్క రోజు గడిచేలోపే 1.25 లక్షల టికెట్లు బుక్ అయినట్లు తనకు రిపోర్ట్ అందిందని.. ఇది తనకు కలలా అనిపిస్తోందని మంచు విష్ణు అన్నాడు. ఇది శివలీల అని విష్ణు పేర్కొన్నాడు.
తన సినిమాకు ఇలాంటి స్పందన రావడం చాలా ఆనందంగా ఉందన్న విష్ణు.. తనకు కూడా కన్నప్ప టికెట్లు దొరకడం కష్టమైందని చెప్పుకొచ్చాడు. తాను ఇంకా కన్నప్ప ఫైనల్ కాపీ చూడలేదని.. శుక్రవారం ఉదయం తన తండ్రితో పాటు స్పెషల్ షో చూద్దామని ఒక థియేటర్లో టికెట్లు అడిగితే.. అన్నీ అయిపోయాయని.. టికెట్లు ఇవ్వడం కష్టమని చెప్పారని విష్ణు వెల్లడించాడు.
దీంతో తమ కోసం మరో షో ఏర్పాటు చేసుకున్నట్లు విష్ణు తెలిపాడు. సినిమాకు ఇంత పెద్ద రిలీజ్ సాధ్యమైందంటే అది ప్రభాస్ వల్లే అని ఈ సందర్భంగా విష్ణు చెప్పాడు.
ఇక కన్నప్ప నుంచి నుంచి రెండు రోజుల కిందట రిలీజ్ చేసిన వార్నింగ్ నోట్ గురించి విష్ణు స్పందించాడు. ఇది వార్నింగ్ కాదని.. తనకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ లేదని అతను చెప్పాడు. కన్నప్ప సినిమా గురించి నెగెటివ్ క్యాంపైన్ చేయడానికి ఒక వర్గం కాచుకుని కూర్చుందని.. వాళ్లను ఉద్దేశించే ఇలా నోట్ రిలీజ్ చేశామని విష్ణు తెలిపాడు.
మెజారిటీ జనానికి సినిమా నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తమకు ఉందని… సీనియర్ జర్నలిస్టులు సినిమాలో తప్పొప్పులను సరిగా విశ్లేషించి రివ్యూలు రాస్తారని.. అలా కాకుండా పనిగట్టుకుని సినిమా గురించి దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి గురించే తమకు అభ్యంతరమని విష్ణు తెలిపాడు. ఒక థియేటర్ దగ్గర గొడవ చేయాలని ఒక బ్యాచ్ ప్రణాళిక వేసుకుందని తమకు సమాచారం అందిందని విష్ణు చెప్పాడు.
అలాగే థియేటర్ల దగ్గర నెగెటివ్ రివ్యూలు ఇవ్వడానికి కూడా కొందరు రెడీ అయ్యారన్నాడు. బాలీవుడ్ మీడియా వాళ్లకు తాము స్పెషల్ షో వేసి చూపిస్తే పాజిటివ్ రివ్యూలు ఇచ్చారని.. ఈలోపే 40 మందికి పైగా నెగెటివ్ రివ్యూలు పెట్టారని.. వాళ్లెవ్వరో గుర్తించామని.. పనిగట్టుకుని నెగెటివ్ రివ్యూలు ఇచ్చేవారిని, షో చూస్తూ వీడియోలు పెట్టేవారిని కచ్చితంగా బ్లాక్ చేయిస్తామని విష్ణు హెచ్చరించాడు.
This post was last modified on June 26, 2025 9:48 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…