మంచు వారి కలల సినిమా కన్నప్ప విడుదలకు కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ సందర్భంగా ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు మంచు విష్ణు. బుధవారమే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశామని.. ఒక్క రోజు గడిచేలోపే 1.25 లక్షల టికెట్లు బుక్ అయినట్లు తనకు రిపోర్ట్ అందిందని.. ఇది తనకు కలలా అనిపిస్తోందని మంచు విష్ణు అన్నాడు. ఇది శివలీల అని విష్ణు పేర్కొన్నాడు.
తన సినిమాకు ఇలాంటి స్పందన రావడం చాలా ఆనందంగా ఉందన్న విష్ణు.. తనకు కూడా కన్నప్ప టికెట్లు దొరకడం కష్టమైందని చెప్పుకొచ్చాడు. తాను ఇంకా కన్నప్ప ఫైనల్ కాపీ చూడలేదని.. శుక్రవారం ఉదయం తన తండ్రితో పాటు స్పెషల్ షో చూద్దామని ఒక థియేటర్లో టికెట్లు అడిగితే.. అన్నీ అయిపోయాయని.. టికెట్లు ఇవ్వడం కష్టమని చెప్పారని విష్ణు వెల్లడించాడు.
దీంతో తమ కోసం మరో షో ఏర్పాటు చేసుకున్నట్లు విష్ణు తెలిపాడు. సినిమాకు ఇంత పెద్ద రిలీజ్ సాధ్యమైందంటే అది ప్రభాస్ వల్లే అని ఈ సందర్భంగా విష్ణు చెప్పాడు.
ఇక కన్నప్ప నుంచి నుంచి రెండు రోజుల కిందట రిలీజ్ చేసిన వార్నింగ్ నోట్ గురించి విష్ణు స్పందించాడు. ఇది వార్నింగ్ కాదని.. తనకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ లేదని అతను చెప్పాడు. కన్నప్ప సినిమా గురించి నెగెటివ్ క్యాంపైన్ చేయడానికి ఒక వర్గం కాచుకుని కూర్చుందని.. వాళ్లను ఉద్దేశించే ఇలా నోట్ రిలీజ్ చేశామని విష్ణు తెలిపాడు.
మెజారిటీ జనానికి సినిమా నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తమకు ఉందని… సీనియర్ జర్నలిస్టులు సినిమాలో తప్పొప్పులను సరిగా విశ్లేషించి రివ్యూలు రాస్తారని.. అలా కాకుండా పనిగట్టుకుని సినిమా గురించి దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి గురించే తమకు అభ్యంతరమని విష్ణు తెలిపాడు. ఒక థియేటర్ దగ్గర గొడవ చేయాలని ఒక బ్యాచ్ ప్రణాళిక వేసుకుందని తమకు సమాచారం అందిందని విష్ణు చెప్పాడు.
అలాగే థియేటర్ల దగ్గర నెగెటివ్ రివ్యూలు ఇవ్వడానికి కూడా కొందరు రెడీ అయ్యారన్నాడు. బాలీవుడ్ మీడియా వాళ్లకు తాము స్పెషల్ షో వేసి చూపిస్తే పాజిటివ్ రివ్యూలు ఇచ్చారని.. ఈలోపే 40 మందికి పైగా నెగెటివ్ రివ్యూలు పెట్టారని.. వాళ్లెవ్వరో గుర్తించామని.. పనిగట్టుకుని నెగెటివ్ రివ్యూలు ఇచ్చేవారిని, షో చూస్తూ వీడియోలు పెట్టేవారిని కచ్చితంగా బ్లాక్ చేయిస్తామని విష్ణు హెచ్చరించాడు.
This post was last modified on June 26, 2025 9:48 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…