ధనుష్ తమిళంలో మిడ్ రేంజ్ స్టార్. అతడి ఖాతాలో వంద కోట్ల సినిమాలున్నాయి. తన సినిమా రిలీజవుతుంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. తొలి రోజు మార్నింగ్ షోలకు ఈజీగా హౌస్ ఫుల్స్ పడిపోతాయి. కానీ తన కొత్త చిత్రం ‘కుబేర’ విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. ధనుష్ చివరి సినిమా ‘రాయన్’ హిట్ అయినా సరే.. ‘కుబేర’కు క్రేజ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఇది బేసిగ్గా తెలుగు దర్శకుడు తీసిన తెలుగు చిత్రం కావడం .. మాస్ అంశాలు మిస్ కావడం.. ప్రోమోలు కనెక్ట్ కాకపోవడం.. ఇలా రకరకాల కారణాలు తోడై సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. ధనుష్ స్టార్ అయ్యాక అతి తక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ అయిన సినిమాగా ఇది నిలిచింది.
కానీ ధనుష్ మాత్రం సినిమా మీద చాలా ధీమాగా కనిపించాడు. రిలీజ్ తర్వాత పరిస్థితి మారిపోతుందని ఆశించాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. నిన్న మార్నింగ్ షోలు పూర్తయ్యాయో లేదో.. తమిళనాట ‘కుబేర’ బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మ్యాట్నీ షోల నుంచే థియేటర్లు ఫుల్ కావడం మొదలైంది. సాయంత్రానికి టికెట్లు దొరకడం కష్టమయ్యే పరిస్థితి. సినిమాకు అదిరిపోయే టాక్ రావడం.. ధనుష్ పెర్ఫామెన్స్ అద్భుతం అని అందరూ కొనియాడడం.. రివ్యూలు కూడా ఫుల్ పాజిటివ్గా రావడంతో చెన్నై సహా ప్రధాన నగరాల్లో ‘కుబేర’ థియేటర్లు జనాలతో నిండిపోయాయి.
కెరీర్లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పెర్ఫామెన్స్లు ఇచ్చినప్పటికీ.. ‘కుబేర’లో ధనుష్ నటన వేరే లెవెల్ అని.. అతడికి మరో జాతీయ అవార్డు వస్తే ఆశ్చర్యం లేదని అంటున్నారు. మన శేఖర్ కమ్ముల మీద తమిళ జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతణ్ని అరుదైన దర్శకుడిగా కొనియాడుతున్నారు. గొప్ప కథ రాసి.. మంచి ఇంటెన్షన్తో సినిమా తీశాడని.. ఇలాంటి సినిమాకు మంచి ఫలితాన్ని అందించాల్సిన బాధ్యత ప్రేక్షకులపై ఉందని అక్కడి క్రిటిక్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో సైతం ‘కుబేర’ వసూళ్లు నిన్న సాయంత్రానికి బాగా పుంజుకున్నాయి. వీకెండ్లో సినిమా భారీ వసూళ్లే సాధించేలా ఉంది. ‘కుబేర’కు లాంగ్ రన్ కూడా ఉంటుందని ఆశిస్తున్నారు.
This post was last modified on June 21, 2025 6:20 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…