వెండితెరపై పెద్దగా రొమాన్స్ చేయని హీరోల్లో ప్రభాస్ను ఒకడిగా చెప్పుకోవాలి. ఒకప్పుడైనా లవ్ స్టోరీలు, రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలు చేసేవాడు కానీ.. ‘బాహుబలి’తో తన ఇమేజ్ ఆకాశానికి చేరిపోయాక ప్రభాస్ సినిమాల్లో రొమాన్స్ డోస్ బాగా తగ్గిపోయింది. ‘రాధేశ్యామ్’ను మినహాయిస్తే తన చిత్రాల్లో ఈ మధ్య రొమాంటిక్ యాంగిలే కనిపించదు. స్వయంగా ప్రభాసే ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నాడట. ఇదే విషయాన్ని దర్శకుడు మారుతి దగ్గర కూడా ప్రస్తావించాడట.
‘రాజాసాబ్’లో వీలైతే ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా అని ప్రభాస్ సరదాగా తనను అడిగినట్లు మారుతి నిన్నటి టీజర్ లాంచ్ ఈవెంట్లో చెప్పడం విశేషం. ‘సలార్’, ‘కల్కి’ చిత్రాల్లో తనకు హీరోయిన్ ఉన్నా లేనట్లే అని.. ‘ఆదిపురుష్’లో తనకు జోడీగా ఉన్నది సీత పాత్ర కావడంతో అక్కడా రొమాన్స్ లేదని.. నిజ జీవితంలోనూ తన జీవితంలో హీరోయిన్ లేని నేపథ్యంలో ‘రాజా సాబ్’లో ఇద్దరు హీరోయిన్లను పెట్టమని ప్రభాస్ అడిగితే.. ఇద్దరేంటి ముగ్గురిని పెడదాం అని ఆ ప్రకారమే చేసినట్లు మారుతి వెల్లడించాడు.
ప్రభాస్ అడగడం, మారుతి పెట్టడం ఏమో కానీ.. ‘రాజా సాబ్’లో గ్లామర్ డోస్ గట్టిగానే ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. గ్లామర్ క్వీన్స్గా పేరున్న నిధి అగర్వాల్, మాళవిక మోహనన్లతో పాటు ఇప్పటిదాకా చిన్న సినిమాలే చేసిన రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. టీజర్లో ఈ ముగ్గురూ బాగానే గ్లామర్ ఒలకబోశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిరంతరం సెక్సీ ఫొటో షూట్లతో కుర్రకారును కవ్విస్తూ ఉండే మాళవిక మోహనన్.. ఒక సీన్లో పొట్టి నిక్కరుతో చాలా గ్లామరస్గా కనిపించింది.
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మాళవికను తెలుగు సినిమాల్లో చూడాలని మన కుర్రాళ్లు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. తన తొలి తెలుగు చిత్రంలో తన ఇమేజ్కు తగ్గ పాత్రే పోషిస్తున్నట్లుంది మాళవిక. నిధి సైతం ఆమెకు పోటీగా అందాలు చిందించింది. చాలా ఆకర్షణీయంగా కనిపించింది. సినిమాలో ఆమెనే లీడ్ హీరోయిన్లా కనిపిస్తోంది. రిద్ధి కుమార్ ఒక్క ఫ్రేమ్లోనే కనిపించినా.. ఆమె కూడా చాలా హాట్గానే కనిపించింది. టీజర్ చూశాక సినిమాలో కావాల్సినంత రొమాన్స్ ఉంటుందని.. కుర్రాళ్లను థియేటర్లకు రప్పించడంలో హీరోయిన్లూ కీలక పాత్ర పోషిస్తారని స్పష్టమైంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…