వెండితెరపై పెద్దగా రొమాన్స్ చేయని హీరోల్లో ప్రభాస్ను ఒకడిగా చెప్పుకోవాలి. ఒకప్పుడైనా లవ్ స్టోరీలు, రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలు చేసేవాడు కానీ.. ‘బాహుబలి’తో తన ఇమేజ్ ఆకాశానికి చేరిపోయాక ప్రభాస్ సినిమాల్లో రొమాన్స్ డోస్ బాగా తగ్గిపోయింది. ‘రాధేశ్యామ్’ను మినహాయిస్తే తన చిత్రాల్లో ఈ మధ్య రొమాంటిక్ యాంగిలే కనిపించదు. స్వయంగా ప్రభాసే ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నాడట. ఇదే విషయాన్ని దర్శకుడు మారుతి దగ్గర కూడా ప్రస్తావించాడట.
‘రాజాసాబ్’లో వీలైతే ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా అని ప్రభాస్ సరదాగా తనను అడిగినట్లు మారుతి నిన్నటి టీజర్ లాంచ్ ఈవెంట్లో చెప్పడం విశేషం. ‘సలార్’, ‘కల్కి’ చిత్రాల్లో తనకు హీరోయిన్ ఉన్నా లేనట్లే అని.. ‘ఆదిపురుష్’లో తనకు జోడీగా ఉన్నది సీత పాత్ర కావడంతో అక్కడా రొమాన్స్ లేదని.. నిజ జీవితంలోనూ తన జీవితంలో హీరోయిన్ లేని నేపథ్యంలో ‘రాజా సాబ్’లో ఇద్దరు హీరోయిన్లను పెట్టమని ప్రభాస్ అడిగితే.. ఇద్దరేంటి ముగ్గురిని పెడదాం అని ఆ ప్రకారమే చేసినట్లు మారుతి వెల్లడించాడు.
ప్రభాస్ అడగడం, మారుతి పెట్టడం ఏమో కానీ.. ‘రాజా సాబ్’లో గ్లామర్ డోస్ గట్టిగానే ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. గ్లామర్ క్వీన్స్గా పేరున్న నిధి అగర్వాల్, మాళవిక మోహనన్లతో పాటు ఇప్పటిదాకా చిన్న సినిమాలే చేసిన రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. టీజర్లో ఈ ముగ్గురూ బాగానే గ్లామర్ ఒలకబోశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిరంతరం సెక్సీ ఫొటో షూట్లతో కుర్రకారును కవ్విస్తూ ఉండే మాళవిక మోహనన్.. ఒక సీన్లో పొట్టి నిక్కరుతో చాలా గ్లామరస్గా కనిపించింది.
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మాళవికను తెలుగు సినిమాల్లో చూడాలని మన కుర్రాళ్లు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. తన తొలి తెలుగు చిత్రంలో తన ఇమేజ్కు తగ్గ పాత్రే పోషిస్తున్నట్లుంది మాళవిక. నిధి సైతం ఆమెకు పోటీగా అందాలు చిందించింది. చాలా ఆకర్షణీయంగా కనిపించింది. సినిమాలో ఆమెనే లీడ్ హీరోయిన్లా కనిపిస్తోంది. రిద్ధి కుమార్ ఒక్క ఫ్రేమ్లోనే కనిపించినా.. ఆమె కూడా చాలా హాట్గానే కనిపించింది. టీజర్ చూశాక సినిమాలో కావాల్సినంత రొమాన్స్ ఉంటుందని.. కుర్రాళ్లను థియేటర్లకు రప్పించడంలో హీరోయిన్లూ కీలక పాత్ర పోషిస్తారని స్పష్టమైంది.
This post was last modified on June 17, 2025 10:10 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…