సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రకలకలం సృష్టించింది. ఇది అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. తిమ్మరాయప్ప అనే వ్యక్తి ముని కన్నప్ప అనే వ్యక్తిదగ్గర 80 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దీనిని తీర్చలేక.. ఆయన పొరుగు ప్రాంతానికి వెళ్లిపోయాడు. దీంతో ఆయన భార్య శిరీష కూడా.. ఇద్దరు పిల్లలను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్లి గుట్టుగా జీవిస్తోంది. అయితే.. తాజాగా ఆమె సొంత ప్రాంతానికి వచ్చారు.
ఈ విషయం తెలిసి.. అప్పు ఇచ్చిన తిమ్మరాయప్ప కుటుంబం ఆమెను నిర్బంధించి చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. బాధితులకు అండగా ఉండాలని, నిందితులను శిక్షించాలని ఆయన సూచించారు. అయితే.. దీనిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషమన్నారు.
సభ్య సమాజం తల దించుకొనే దుశ్చర్యగా దీనిని అభివర్ణించారు. కన్న కొడుకు ముందే తల్లికి జరిగిన ఘోర అవమానాన్ని సాటి మహిళగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. తెలుగింటి ఆడపడుచుకి సీఎం ఇలాకాలోనే రక్షణ లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనమని విమర్శలు గుప్పించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే ధైర్యం కుప్పంలో చంద్రబాబు గారు ఇచ్చారా ? అని నిలదీశారు. లేక మహిళా హోంమంత్రి గారు ఇచ్చారా ? అని ప్రశ్నించారు.
మహిళల మీద ఇలాంటి దాడులు జరగడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని షర్మిల వ్యాఖ్యానించారు. ఆడపడుచుల పక్షపాతి అని, తెలుగింటి ఆడపడుచుల పార్టీ తెలుగుదేశం పార్టీ అని.. గొప్పలు చెప్పుకోవడం పక్కన పెట్టి ఇలాంటి అమానవీయ ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూడండి అని చంద్రబాబుకు సూచించారు. ఆ మహిళకు జరిగిన అవమానానికి బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సలహా ఇచ్చారు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…