Movie News

20 సంవత్సరాల తర్వాత పవన్ రికార్డ్

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక సినిమా రావడమే గగనమైపోయింది. రెండు మూడేళ్ళకో రిలీజ్ చేస్తున్న వాళ్ళూ లేకపోలేదు. ప్రభాస్ ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ని సెట్స్ మీద ఉంచుతున్నా లాభం లేకపోతోంది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు ఇవ్వడం వెనుక ఒక ప్రత్యేక విశేషం ఉంది. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో కెరీర్ మొదలుపెట్టిన పవన్ ఇప్పటిదాకా ఏ ఇయర్ లోనూ రెండు రిలీజులు చేసుకోలేదు. ఒక్క 2006 లో మాత్రమే బంగారం, అన్నవరం ఏడు నెలల గ్యాప్ లో వచ్చాయి. ఆశించిన ఫలితాలు అందుకోకపోవడం వేరే విషయం.

ఇప్పుడలాంటి సీనే ఇరవై సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతోంది. దానికి 2025 వేదిక కానుంది. కేవలం మూడు నెలల గ్యాప్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి రెండు విడుదలకు రెడీ అవుతున్నాయి ఏదైనా కారణాల వల్ల డేట్లు కొంచెం ముందు వెనక్కు జరగొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కానే. 1996 నుంచి 2025 దాకా పవన్ కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేయడం గమనించాల్సిన విషయం. ఇది కాకతాళీయంగా జరిగినప్పటికి ఫ్యాన్స్ కి మాత్రం స్పెషల్ మెమరీ కానుంది. భవిష్యత్తులో పవన్ ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ ఇది రిపీట్ కాకపోయే అవకాశాలు ఎక్కువ.

మార్కెట్ పరంగా ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. హరిహర వీరమల్లు, ఓజి కలిపి ఎంతలేదన్నా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల దాకా థియేటర్ బిజినెస్ చేయబోతున్నాయి. ఇది ఒకరకంగా కొత్త మైలురాయి. సెప్టెంబర్ 25 ఓజి రావడం కన్ఫర్మ్ అయ్యింది కానీ ఎటొచ్చి వీరమల్లు తేదీ ఇంకా డిసైడ్ కాలేదు. జూలై మూడు లేదా నాలుగో వారంలో విడుదల చేసేందుకు నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ట్రైలర్ కట్ ఫినిష్ చేసి దాంతో పాటే విడుదల తేదీని లాక్ చేయబోతున్నారు. ఇది చూశాకే అంచనాలు అమాంతం పెరుగుతాయనే ధీమా టీమ్ లో ఉంది.

Kumar

Recent Posts

రామాయణ ఇంకెప్పుడు మేలుకుంటుంది

ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…

5 hours ago

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి…

8 hours ago

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

11 hours ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

11 hours ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

13 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

14 hours ago