వైసీపీ అధినేత జగన్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆయన బుధవారం పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను పరామర్శించేందుకు వచ్చారు. అయితే.. రాజధాని అమరావతి పై సాక్షి టీవీలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లపై మహిళలు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. గత నాలుగు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
సాక్షి టీవీలో చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అధినేతగా, సాక్షి టీవీ యజమానిగా జగన్ సమాధానం చెప్పాలని, మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని.. మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. జగన్ కానీ, భారతి కానీ.. ఎక్కడా స్పందించలేదు. అసలు పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పొదిలి పర్యటనకు వచ్చిన జగన్కు మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త మైంది.ఆయన పర్యటిస్తున్న సమయంలో మహిళలు నల్ల బెలూన్లను గాలిలోకి ఎగురవేసి నిరసన తెలిపారు.
అదేవిధంగా ప్లకార్డులు చేతిలో పట్టుకుని ఆందోళన నిర్వహించారు. “జగన్ గో బ్యాక్” నినాదాలతో హోరె త్తించారు. ‘జగన్ క్షమాపనలు చెప్పాల్సిందే’ అని రాసి ఉన్న బోర్డులు కూడా కనిపించాయి. అయితే.. వీరిని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఆగ్రహానికి గురైన మహిళలు చెప్పులు, రాళ్లు రువ్వారు. వీటిలో కొన్ని చెప్పులు జగన్ కాన్వాయ్పై పడ్డాయి. అయితే.. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
మరోవైపు.. వైసీపీ కార్యకర్తలు కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్కు రాయి తగిలి గాయమైంది. దీంతో జగన్ పర్యటించిన ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీ చార్జి చేస్తారన్న భయంతో పలువురు యువతులు పరుగులు పెట్టారు.ఇన్ని ఉద్రిక్తతల మధ్య జగన్ పర్యటన సాగింది. చివరకు ఆయన రైతులను కలుసుకున్నారు.
This post was last modified on June 11, 2025 2:37 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…