దర్శకుడు సుకుమార్ త్వరలో షారుఖ్ ఖాన్ తో ఓ సినిమా చేయబోతున్నాడని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుందని ముంబై మీడియా రెండు మూడు రోజులుగా తెగ ఊదరగొడుతోంది. ఇప్పట్లో ఇది జరిగే పని కాదనే వాస్తవాన్ని విస్మరించి తెలివిగా పుష్ప డైరెక్టర్ విత్ కింగ్ ఖాన్ అంటూ హెడ్డింగులు పెట్టి తెగ ఊరిస్తోంది. ప్రాక్టికల్ కోణంలో ఆలోచిస్తే ఇందులో నిజానిజాలేంటో బయట పడతాయి. ముందుగా సుకుమార్ చేతిలో రామ్ చరణ్ 17 అనే పెద్ద బాధ్యత ఉంది. ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. తన టీమ్ తో కలిసి తయారు చేసే పనిలో ఉన్నారు. ఎంతలేదన్నా ఇంకో రెండు మూడు నెలలు పట్టేలా ఉంది.
ప్రీ ప్రొడక్షన్ కు మరో ఏడెనిమిది నెలలు అవసరం పడొచ్చని అంటున్నారట. అంటే మొత్తంగా సెట్స్ పైకి వెళ్ళడానికి అంతా కలిపి ఏడాది పైనే సమయం పడుతుంది. ఈలోగా పెద్ది ఈజీగా అయిపోతుంది కాబట్టి దాని తర్వాత త్రివిక్రమ్ తో రామ్ చరణ్ ఒక సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయానే వార్త నిన్నంతా హాట్ టాపిక్ గా మారింది. సో ఎలా చూసుకున్న సుకుమార్ దృష్టి మొత్తం ఆర్సి 17 మీదే ఉంది. ఒకవేళ షారుఖ్ ఖాన్ ఆసక్తి చూపించినా ఇంకో రెండేళ్ల తర్వాత సాధ్యం కావొచ్చు. ఎందుకంటే అతను కూడా భారీ బడ్జెట్ మూవీ కింగ్ మీద బోలెడు డబ్బు, సమయం పెట్టుబడిగా పెడుతున్నారు.
సో షారుఖ్ విత్ సుకుమార్ ప్రస్తుతానికి ఊహాగానం మాత్రమే. ఇది ఎందుకు పుట్టినదంటే మైత్రి ఇటీవలే సన్నీ డియోల్ తో జాట్ రూపంలో మంచి హిట్టు కొట్టింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెలుగు వాసనలు నింపినా నార్త్ ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. తనకే అలా ఉంటే ఇక పుష్ప సృష్టికర్త షారుఖ్ తో చేతులు కలిపితే ఎలా ఉంటుందనేది హిందీ మీడియా ఎలివేషన్. వినడానికి బాగానే ఉంది కానీ సుకుమార్ ఫోకస్ ప్రస్తుతానికి బాలీవుడ్ వైపు లేదు. రంగస్థలం కాంబో కనక రామ్ చరణ్ కు అంతకు మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన టార్గెట్ సుకుమార్ భుజాల మీద ఉంది.
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…