Political News

జూలై నుంచి ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్‌.. !

టీడీపీ కీల‌క కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నుంది. వ‌చ్చే జూలై 1 నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని ప్రారంబించ‌నుంది. దీనికి సంబంధించి ప‌క్కా ప్రణాళిక‌ను ఇప్ప‌టికే రూపొందించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో పాల నా పరంగా తీసుకున్న నిర్ణ‌యాలు, ప్ర‌జ‌ల‌కు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి అనేక అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌ను న్నారు. ప్ర‌జ‌ల ప‌రంగా పార్టీ హ‌వా త‌గ్గ‌కూడ‌ద‌న్న వ్యూహాన్ని కూడా అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ పార్టీని ప్ర‌జ‌ల‌కు క‌నెక్ష‌న్ క‌లిపి ఉంచేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

ఏంటి ల‌క్ష్యం..?
పాల‌న‌ప‌రంగా ఏడాది పూర్త‌యినప్ప‌టికీ.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆశిస్తున్న స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వంపై రియాక్ష‌న్ ఉండ‌డం లేదు. నిజానికి చంద్ర‌బాబు ఇప్ప‌టికేచేయించిన స‌ర్వేల్లో 80 శాతం సంతృప్తి ఉంద‌ని చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయకుల‌కు అంతే మొత్తంలో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యం త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనివ‌ల్ల పై స్థాయిలో ఎంత చేసినా.. రేపుఎన్నిక‌ల స‌మ‌యానికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌ధానంగా ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి చూడ‌కుండా.. ఇప్ప‌టి నుంచి మురికి క‌డుక్కునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే సంక్షేమ ప‌థ‌కాల‌పై అసంతృప్తి ఉన్న‌వారిని, ప‌థ‌కాలు అంద‌ని వారిని కూడా గుర్తించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల‌కు-ప్ర‌జ‌ల మ‌ధ్య గ్యాప్ పెరుగుతున్న‌ద‌న్న సంకేతాలు బలంగా వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ గ్యాప్‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా త‌గ్గించేందుకు కూడా ప్ర‌భుత్వం ప‌రంగా పార్టీ ఈ చ‌ర్య‌ల‌కు న‌డుంబిగింది. వాస్త‌వానికి క్షేత్ర‌స్థా యిలో చంద్ర‌బాబుకు ఉన్న పేరు గ్రాఫ్ ప‌రంగా చూసుకుంటే పెరిగింది. కానీ, ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబును చూసి వేసే వారికంటే.. కూడా నాయ‌కుల‌ను చూసి ఓటేసేవారు పెరుగుతార‌న్న అంచ‌నా ఉంది.

ఈ నేప‌థ్యంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల‌ను యాక్టివ్ చేసే కార్య‌క్ర‌మాన్ని శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలోనే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని విజ‌యంవంతం చేసే దిశ‌గా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరిగే నాయ‌కులు.. కేవ‌లం ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాలే కాకుండా.. త‌మ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏడాది కాలంలో చేసిన ప్ర‌గ‌తిని కూడా వివ‌రించాల‌నేది ప్ర‌ధాన కాన్సెప్టు. అదేవిధంగా ప్ర‌జ‌ల‌తో త‌మ‌కు ఉన్న సంబంధాల‌ను మెరుగు ప‌రిచేందుకు కూడా దీనిని వినియోగించుకోనున్నారు. మొత్తంగా జూలై 1 నుంచి రాష్ట్రంలో కొత్త మార్పు దిశ‌గా టీడీపీ అడుగులు వేయ‌నుంద‌న్న‌ది పార్టీలో చ‌ర్చ‌సాగుతోంది.

Satya

Recent Posts

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

46 minutes ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

59 minutes ago

రజినీకి నచ్చనిది కమల్‌కు నచ్చిందా?

తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…

2 hours ago

కాపులంటే వైసీపీలో ఉన్నొళ్లు మాత్రమేనా?

ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…

2 hours ago

సాయిపల్లవి చేసుంటే ఎలా ఉండేది

మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…

4 hours ago

తమిళ నటుడికి పిచ్చెక్కించేసిన కంచరపాలెం

స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్‌కు మంచి గుర్తింపే ఉంది.…

4 hours ago