స్పిరిట్ నుంచి దీపికా పదుకునే తప్పుకోవడం గురించి మినీ సైజ్ రచ్చే జరిగింది. తన కండీషన్లు, రెమ్యునరేషన్ నచ్చక సందీప్ రెడ్డి వంగా పక్కన పెట్టాడని ఒక వర్గం, లేదు బిడ్డ తల్లిగా కొత్త బాధ్యత వచ్చిన తనకు పని గంటలకు సంబంధించి మినహాయింపు దొరకనందుకే తప్పుకుందని ఇంకో బ్యాచ్ ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూర్చేలా దీపికాకు ఏ మాత్రం సరితూగని త్రిప్తి డిమ్రిని మెయిన్ హీరోయిన్ గా తీసుకుని సందీప్ వంగా పెద్ద షాకే ఇచ్చాడు. అయితే ఇవాళ విడుదలైన అల్లు అర్జున్ 22 అనౌన్స్ మెంట్ మీడియాలో దీపికా గెటప్ చూశాక ఫ్యాన్స్ ఆశ్చర్యం, ఆనందం రెండూ మిక్స్ చేసి చూశారు.
ఇప్పుడో కొత్త టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుందో సరైన స్పష్టత లేదు. పైగా ఎన్ని డేట్లు అవసరమతాయనే క్లారిటీ మిస్సయ్యింది. దీని కోసం వెయిట్ చేయడం కన్నా ఇంకో నెలలో సెట్స్ పైకి వెళ్లబోయే బన్నీ మూవీ అయితే తనకు ఇంకా మైలేజ్ వస్తుందని భావించడం వల్లే దీపికా నిర్ణయం మార్చుకున్నట్టు ముంబై సర్కిల్స్ లో వినిపిస్తోంది. అంతే కాదు ఎలాగూ కల్కిలో ప్రభాస్ సరసన జోడి కట్టేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా అల్లు అర్జున్ పక్కన కనిపిస్తే తన ఫిల్మోగ్రఫీలో మరో ల్యాండ్ మార్క్ మూవీ తోడవుతుందని ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చని మాట్లాడుతున్నారు.
ఏది నిజమో ఏమో కానీ ఇవాళ్టి వీడియోలో కత్తులు ఆయుధాలు పట్టుకుని ప్రమాదకరమైన సాహసాలు చేసే క్యారెక్టర్ ని అట్లీ డిజైన్ చేసిన విధానం చూస్తే పెద్ద స్కెచ్చే కనిపిస్తోంది. దీపికా కొంత కాలంగా ఇంత ప్రాధాన్యం ఉన్న పాత్ర అది కూడా ఫాంటసీ మూవీలో చేయలేదు. సో ఇదో అవకాశంగా భావించి ఉండొచ్చు. మరో న్యూస్ ఏంటంటే దీన్ని అట్లీ రెండు భాగాలుగా ప్లాన్ చేసుకున్నాడట. అందరిలా ఒకదాని తర్వాత మరొకటి కాకుండా ఒకేసారి రెండు పార్ట్స్ పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ఉన్నాడని అంటున్నారు. ప్రకటన స్టేజిలోనే ఇంత హాట్ టాపిక్ గా మారిన ఏఏ 22 ఇక అసలు షూట్ మొదలయ్యాక ఇంకే సెన్సేషన్లు తెస్తుందో.
This post was last modified on June 7, 2025 8:26 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…