పిన్ కోడ్.. ఈ మాట తరచుగా వింటూనే ఉంటాం. పోస్టల్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా పిన్కోడ్పైనే ఆధార పడి పనిచేస్తుంది. ఒక ఉత్తరం చేరాలన్నా.. ఒకకొరియర్ రావాలన్నా.. పిన్ కోడ్ ముఖ్యం. అంతేకాదు.. ఇప్పుడు రుణాలు తీసుకునేందుకు కూడా.. ప్రైవేటు బ్యాంకులు `పిన్ కోడ్`ను ఖచ్చితం చేశాయి. తద్వారా.. ఆయా పిన్ కోడ్ల పరిధిలో రుణ గ్రహీతల పరపతి ఎలా ఉందన్నది అంచనా వేస్తున్నాయి. ఇలా.. పిన్ కోడ్ దైనందిన లావాదేవీల్లో కీలకంగా మారింది.
అయితే.. ఇప్పుడు ఈ పిన్కోడ్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త వెర్షన్ తీసుకువస్తోంది. దీనినే `డిజి పిన్`గా వ్యవహరిస్తారు. మారుతున్న కాలానికి.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అన్ని మార్పులు చోటు చేసుకుంటున్నట్టుగానే.. ఈ పిన్కోడ్ విషయంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజి పిన్ ద్వారా.. మరింత ఖచ్చితత్వంతో మనకు కావాల్సిన ప్రాంతాలను.. ఇళ్లను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని.. ఎవరినీ సంప్రదించకుండానే.. మనం కోరుకున్న అడ్రస్కు చేరుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
ఇండియన్ పోస్టు ఆఫీసు, ఐఐటీ హైదరాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఇస్రో)లు సంయుక్తంగా డిజిపిన్ ను అభివృద్ధి చేశాయి. `ఓపెన్ సోర్స్ జియోకోడ్ అడ్రస్ వ్యవస్థ`గా దీనిని పేర్కొంటున్నారు. దీని ప్రకారం.. దేశాన్ని చిన్న చిన్న ప్రాంతాలుగా విభజిస్తారు. సుమారు 10 నుంచి 15 ఇళ్లకు ఒక డిజిపిన్ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇలా.. ప్రతి గ్రిడ్కు ప్రత్యేకమైన 10 అక్షరాల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్ను కేటాయిస్తారు. ఈ కోడ్ ను జీపీఎస్కు అనుసంధానం చేస్తారు. తద్వారా.. అత్యంత వేగంగా.. సునాయాసంగా కోరుకున్న ప్రాంతాలకు చేరుకునే సౌకర్యం ఏర్పడుతుంది.
డిజిపిన్లో ప్రతి ఇంటికీ ప్రత్యేకమైన 10 అక్షరాల నెంబర్ కేటాయిస్తారు. ఇది దేశంలో డిజిటల్ అడ్రస్సింగ్ విధానాన్ని సమూలంగా అందివచ్చేలా చేస్తుంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ డోర్ డెలివరీ సేవలు మరింత సమర్థవంతంగా అందనున్నాయి.
This post was last modified on June 7, 2025 4:07 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…