Movie News

పెద్ద పందెం ఆడబోతున్న వార్ 2

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తొలి కలయికలో రూపొందుతున్న వార్ 2 రెండు నెలల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలు ఊపందుకున్నాయి. ట్రేడ్ టాక్ ప్రకారం ఏపీ తెలంగాణలో యష్ రాజ్ ఫిలింస్ స్వంతంగా రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్న వార్త రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. థియేటర్ వేల్యూ 90 కోట్ల దాకా ఉంటుందని అంతర్గత సమాచారం. మాములుగా అయితే ఇది తారక్ ఇమేజ్ కి ఈజీగా రికవర్ చేసే మొత్తం. కానీ హృతిక్ తో పాటు దర్శకుడు, కంటెంట్ అన్నీ బాలీవుడ్ ఫ్లేవర్ లో ఉండటం వల్ల కేవలం జూనియర్ ఇమేజ్ ఒకటే మార్కెటింగ్ కి సరిపోదు.

మాములుగా ఇతర నిర్మాతలకు డబ్బింగ్  హక్కులు అమ్మేయడం వల్ల యష్ సంస్థ ఆశించిన సొమ్మును సులభంగా రాబట్టుకోవచ్చు. కానీ స్వంతంగా పంపిణీ చేయడం ద్వారా రిస్కులను ఎదురు కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంపిటీషన్ లో ఉన్న కూలీని తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. ప్రమోషన్ల పరంగా చూస్తే వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ కన్నా కూలి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అన్ని రకాలుగా డామినేషన్ చూపిస్తున్నాడు. బ్రాండ్ పరంగా కూడా సౌత్ లో ఎక్కువ గుర్తింపు ఉన్నది లోకేష్ కే. రజనితో పాటు నాగ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి ఆకర్షణలు విపరీతంగా బజ్ ని పెంచేస్తున్నాయి.

ఇలాంటి సిచువేషన్ లో వార్ 2 సర్వశక్తులనూ ఒడ్డాల్సి ఉంటుంది. ప్రమోషన్ల వరకు తారక్ ఎంత ముందుండి నడిపించినా అదొక్కటే చాలదు. ఒకవేళ ఇదే తన సోలో హీరో మూవీ అయ్యుంటే దేవర లాగా లెక్క వేరుగా ఉండేది. హిందీ సినిమా అనే ముద్ర ఖచ్చితంగా ప్రభావం చూపించేదే. అందులోనూ స్పై బ్యాక్ డ్రాప్ కావడంతో తెలుగు మాస్ జనాలను ఆకట్టుకోవడం ఒక రకంగా పెద్ద టాక్. దీన్ని యష్ సంస్థ ఎలా దాటుకుంటుందో చూడాలి. టీజర్ కొచ్చిన రెస్పాన్స్ ఎలా ఉన్నా ట్రైలర్ తో అంచనాలన్నీ మారిపోతాయని టీమ్ అంటోంది. దేశవ్యాప్తంగా ఆల్రెడీ థియేటర్ అగ్రిమెంట్లు మొదలైనట్టు సమాచారం.   

This post was last modified on June 7, 2025 12:33 pm

Share
Show comments
Published by
Satya
Tags: War 2

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago