టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్కు సంబంధించి తర్జన భర్జనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని చివరగా ప్రకటించిన జూన్ 12న కూడా రిలీజ్ చేయడం సందేహంగానే ఉంది. బిజినెస్ పరంగా తలెత్తిన కొన్ని ఇబ్బందులు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల సినిమాను మరోసారి వాయిదా వేయక తప్పని పరిస్థితి తలెత్తుతోందని వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. వాయిదా అనివార్యం అనే అంటున్నారు.
ఐతే వాయిదా నిర్ణయం తీసుకోవడం కూడా అంత తేలిక కాదు. ఓటీటీ సంస్థకు హక్కులు అమ్మాకే ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. భారీ మొత్తానికే డీల్ కుదిరింది. కానీ ఇప్పుడు వేరే కారణాలతో సినిమాను వాయిదా వేస్తామంటే ఓటీటీ సంస్థ ఒప్పుకునే పరిస్థితి లేదు. డిజిటల్ రిలీజ్ స్లాట్ చూసుకున్నాకే ఓటీటీ సంస్థలు డీల్స్ చేసుకుంటాయి. చెప్పిన డేట్ దాటితే ఊరుకోరు. ఆ మేరకు రేట్లు తగ్గించి ఒప్పందాలు రివైజ్ చేస్తారు. ‘హరిహర వీరమల్లు’కు ఇప్పుడు డేట్ మారిస్తే.. ఓటీటీ సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందంలో రూ.20 కోట్ల కోత విధిస్తుందట.
అందుకే నిర్మాత ఏఎం రత్నం.. ఎలాగైనా జూన్ 12కే సినిమాను తీసుకురావాలని గట్టిగా ప్రయత్నించారు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈ లోపు బిజినెస్ పూర్తి చేయడం, సినిమాను పర్ఫెక్ట్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టమవుతోంది. ఓటీటీ డీల్ కంటే థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ కాబట్టి సినిమాను జూన్ 12న రిలీజ్ చేయడం కష్టంగా ఉంది. మరి తర్వాతి డేట్కు అయినా నిర్మాత కోరుకున్న థియేట్రికల్ ఆదాయం వస్తుందా అన్నది సందేహం. డిజిటల్ డీల్ ఆదాయంలో పడే కోతను కూడా ఇప్పుడు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రేట్లు పెంచితే బయ్యర్లు ఎలా ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…