హైదరాబాద్ శివార్లలో ఎటు వైపు చూసినా ఎకరం భూమి కోట్లల్లోనే ఉంటుంది. ఐతే సినీ దర్శకుడు శంకర్కు తెలంగాణ ప్రభుత్వం ఎకరా రూ.5 లక్షల చొప్పున మోకిల్ల ప్రాంతంలో 5 ఎకరాల భూమి కేటాయించడం మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీన్ని సవాలు చేస్తూ కరీంనగర్కు చెందిన శంకర్ అనే వ్యక్తి కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఇంతకుముందు సినీ ప్రముఖులు స్టూడియోలు నిర్మిస్తామంటే ఎంత ధరకు భూములు కేటాయించింది ఇందులో వెల్లడించారు.
ప్రభుత్వ అఫిడవిట్ ప్రకారం అక్కినేని నాగేశ్వర్రావుకు అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం 1975లో రూ.5 వేల చొప్పున 22 ఎకరాలను కేటాయించింది. పద్మాలయ స్టూడియో కోసం 1983లో రూ.8,500 చొప్పున 9.5 ఎకరాలను కేటాయించింది. 1984లో రామానాయుడు స్టూడియో కోసం నామమాత్రపు ధరకే అప్పటి ప్రభుత్వం 5 ఎకరాలను కేటాయించింది. 1984లో దర్శకుడు రాఘవేంద్రరావు, చక్రవర్తి, కృష్ణమోహన్కు రూ.8,500 ప్రకారం అర ఎకరం చొప్పున కేటాయించారు.
ఇక శంకర్ విషయానికి వస్తే ఆయనకు సినీ పరిశ్రమలో 36 ఏళ్ల అనుభవం ఉందని, రూ.50 కోట్లతో ప్రపంచ స్థాయి స్టూడియో నిర్మిస్తానని.. తనకు రాయితీ మీద భూమి కేటాయించాలని 2016లో దరఖాస్తు చేసుకున్నారని, తెలంగాణకు చెందిన స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయనకు భూమి కేటాయించాలని సిఫార్సు చేసిందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
శంకర్కు నార్సింగి, శంకర్పల్లి రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి అభివృద్ధి చేయని భూమినే కేటాయించాం. అక్కడ మార్కెట్ విలువ ఎకరా రూ.20 లక్షలని.. సినీ పరిశ్రమ అభివృద్ధి, ఉద్యోగ కల్పన చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను కేటాయించిందని, ఇందుకోసం శంకర్ రూ.4.4 కోట్లు డిపాజిట్ కూడా చేశారని పేర్కొన్నారు. మరి వ్యాజ్యంపై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on November 8, 2020 6:41 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…