Movie News

వెయ్యి కోట్ల సినిమా.. మణిరత్నం భలే చెప్పాడు

ఇప్పుడు సినిమా ఎలా ఉంది అన్న దాని కంటే.. ఎంత ఓపెనింగ్స్ రాబట్టింది.. ఓవరాల్‌గా ఎంత వూలు చేసింది అన్నదే చర్చనీయాంశంగా మారింది. సినిమా మొదలైనప్పుడే దాని కలెక్షన్ టార్గెట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లు అన్నది ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకీ ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్ ఎప్పుడో ఈ ఘనతను అందుకున్నాయి. కానీ దేశంలో పెద్ద ఇండస్ట్రీల్లో ఒకటైన కోలీవుడ్ మాత్రం ఇంకా ఆ మార్కును అందుకోలేదు.

ఇదే విషయమై తమిళ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆయన తనదైన శైలిలో బదులిచ్చారు. తాను వెయ్యి కోట్ల సినిమా చేయలేనని తేల్చి చెప్పిన ఆయన.. తన వరకు ఎంత మంచి సినిమా తీశామన్నదే ముఖ్యం అని అని చెప్పారు.

“ఒకప్పుడు బాగున్న సినిమా, బాలేని సినిమా అనేది మాత్రమే మాట్లాడుకునేవాళ్లం. ఫిలిం మేకర్స్ అయినా సరే.. ప్రేక్షకులు అయినా సరే ఇదే చూసేవారు. సినిమా బాగుండి దానికి మంచి వసూళ్లు వస్తే అది బోనస్. ముందు మంచి సినిమా తీయడమే లక్ష్యంగా ఉండేది. ఒక దర్శకుడు మంచి సినిమా తీస్తే దాన్ని మించి తీయాలని మరొకరు చూసేవాళ్లు. తమ గత చిత్రాన్ని మించి గొప్ప సినిమా తీయాలని కోరుకునేవారు. ఎప్పుడూ అలాగే ఉండాలి. కలెక్షన్ అనేది తర్వాతి విషయం.

కానీ ఇప్పుడు సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. అసలు విషయాల కంటే దీని మీద ఎక్కువ దృష్టి ఎక్కువ ఉంటోంది. అది శ్రేయస్కరం కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా ఇవే ఉంటాయి. నేనైతే వెయ్యి కోట్ల సినిమా చేయలేను. అలా వసూళ్లను ప్రామాణికంగా తీసుకుని సినిమా చేయను. నా దృష్టి వసూళ్ల కంటే కంటెంట్ మీదే ఉంటుంది. లెక్కలేసుకుని సినిమా చేయలేను” అని మణిరత్నం స్పష్టం చేశారు.

This post was last modified on May 25, 2025 1:46 pm

Share

Recent Posts

బొత్స వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం

మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది…

1 hour ago

నాయకుడు లేకుండా యుద్ధం ఎలా జగన్?

స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్‌ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్‌ ఇస్తున్న…

1 hour ago

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…

2 hours ago

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

3 hours ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

3 hours ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

3 hours ago