ఇప్పుడు సినిమా ఎలా ఉంది అన్న దాని కంటే.. ఎంత ఓపెనింగ్స్ రాబట్టింది.. ఓవరాల్గా ఎంత వూలు చేసింది అన్నదే చర్చనీయాంశంగా మారింది. సినిమా మొదలైనప్పుడే దాని కలెక్షన్ టార్గెట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లు అన్నది ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకీ ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్ ఎప్పుడో ఈ ఘనతను అందుకున్నాయి. కానీ దేశంలో పెద్ద ఇండస్ట్రీల్లో ఒకటైన కోలీవుడ్ మాత్రం ఇంకా ఆ మార్కును అందుకోలేదు.
ఇదే విషయమై తమిళ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆయన తనదైన శైలిలో బదులిచ్చారు. తాను వెయ్యి కోట్ల సినిమా చేయలేనని తేల్చి చెప్పిన ఆయన.. తన వరకు ఎంత మంచి సినిమా తీశామన్నదే ముఖ్యం అని అని చెప్పారు.
“ఒకప్పుడు బాగున్న సినిమా, బాలేని సినిమా అనేది మాత్రమే మాట్లాడుకునేవాళ్లం. ఫిలిం మేకర్స్ అయినా సరే.. ప్రేక్షకులు అయినా సరే ఇదే చూసేవారు. సినిమా బాగుండి దానికి మంచి వసూళ్లు వస్తే అది బోనస్. ముందు మంచి సినిమా తీయడమే లక్ష్యంగా ఉండేది. ఒక దర్శకుడు మంచి సినిమా తీస్తే దాన్ని మించి తీయాలని మరొకరు చూసేవాళ్లు. తమ గత చిత్రాన్ని మించి గొప్ప సినిమా తీయాలని కోరుకునేవారు. ఎప్పుడూ అలాగే ఉండాలి. కలెక్షన్ అనేది తర్వాతి విషయం.
కానీ ఇప్పుడు సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. అసలు విషయాల కంటే దీని మీద ఎక్కువ దృష్టి ఎక్కువ ఉంటోంది. అది శ్రేయస్కరం కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా ఇవే ఉంటాయి. నేనైతే వెయ్యి కోట్ల సినిమా చేయలేను. అలా వసూళ్లను ప్రామాణికంగా తీసుకుని సినిమా చేయను. నా దృష్టి వసూళ్ల కంటే కంటెంట్ మీదే ఉంటుంది. లెక్కలేసుకుని సినిమా చేయలేను” అని మణిరత్నం స్పష్టం చేశారు.
This post was last modified on May 25, 2025 1:46 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…