టాలీవుడ్ ఎగ్జిబిషన్ రంగంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన ఏపి తెలంగాణ సంయుక్త ఎగ్జిబిటర్ల మావేశంలో జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా వచ్చిన వార్తలు సంచలనం రేపుతున్నాయి. అద్దెల ప్రాతిపదికన నడపడం కష్టంగా ఉందని పర్సెంటేజ్ విధానంలోనే ఇకపై వ్యాపారం చేయాలనే ప్రతిపాదనతో పంపిణీదారులంతా ఒకే మాట మీద ఉన్నారని సమాచారం. ఈ రోజు మీటింగ్ లో పలువురు కీలక డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు హాజరు కాకపోవడం చూస్తే వాళ్లకు ఈ ఒప్పందాలు ఎంత మాత్రం రుచించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ముందుగా వినతి పత్రం ఇచ్చి ఆమేరకు అందులోనే బంద్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించే ఆలోచనలో ఎగ్జిబిటర్లు ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే కనక జరిగితే జూన్ రిలీజులు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. ముందుగా కమల్ హాసన్ దగ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. తెలుగులో డబ్బింగ్ కాబట్టి ఇక్కడ వాయిదా వేసినా తమిళ వెర్షన్ యధావిధిగా రిలీజవుతుంది. లేదూ అంటే అసోసియేషన్ పరిధిలోకి రాని మల్టీప్లెక్సుల్లో మాత్రమే షోలు వేయాల్సి ఉంటుంది. అసలు గండం ఇది కాదు. జూన్ 12 హరిహర వీరమల్లు వస్తున్నాడు. దీని మీద పెద్దఎత్తున పెట్టుబడులు, అడ్వాన్సులు ముడిపడి ఉన్నాయి.
సో ఈ నిర్ణయం అమలులోకి వస్తే తీవ్ర చిక్కులు తప్పవు. ఇంకా పన్నెండు రోజుల సమయం ఉంది కాబట్టి సయోధ్యకు టాప్ ప్రొడ్యూసర్లు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. సింగిల్ స్క్రీన్లలో కూడా పర్సెంటేజ్ విధానం తీసుకొస్తే నిర్మాతకొచ్చే రెవిన్యూ తగ్గిపోతుంది. అందుకే కొందరు వ్యతిరేకిస్తున్నారనే భావన డిస్ట్రిబ్యూటర్లలో ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఇండస్ట్రీ పెద్దల నుంచి స్పందన తెలియాల్సి ఉంది. ఇష్యూ మరీ ముదరకుండా వీలైనంత త్వరగా పరిష్కారం చూపిస్తే మంచిది. ఈ రోజు మీటింగ్ లో దిల్ రాజు, సురేష్ బాబుతో సహా 60కి పైగా పంపిణీదారులు పాల్గొన్నట్టు సమాచారం.
This post was last modified on May 18, 2025 5:48 pm
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…
టాలీవుడ్ మెగాస్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడటం అరుదు. ఆ మధ్య భోళా శంకర్, జైలర్…
అల్లరి నరేష్ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్కు ‘నాంది’ శుభారంభం పలికినా.. ఆ తర్వాత అతను నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలందుకోలేరు.…