కొవిడ్ మొదలైన దగ్గర్నుంచి వేసవిలో సినిమాల సందడి అనుకున్నంతగా ఉండట్లేదు. కరోనా ప్రభావంతో రెండు సీజన్లు వేస్టయిపోగా.. ఆ తర్వాతి ఏడాది ‘ఆర్ఆర్ఆర్’తో సందడి నెలకొంది. కానీ గత రెండేళ్లూ భారీ చిత్రాల సందడి కనిపించలేదు. ఈ ఏడాది అయితే పరిస్థితి మరీ దారుణం. ‘హిట్-3’ అనే ఈ సీజన్కు అతి పెద్ద సినిమా అయింది. ఆ స్థాయి సినిమాలు కూడా ఇంకేవీ రిలీజ్ కాలేదు. దీంతో సమ్మర్ లాంటి క్రేజీ సీజన్లో బాక్సాఫీస్ కళ తప్పింది. ఐతే వేసవిలో హీట్ తగ్గినా.. ఆ సీజన్ అయ్యాక మాత్రం బాక్సాఫీస్ బాగా వేడెక్కబోతోంది.
జూన్ మొదటి వారం నుంచి నెల రోజుల పాటు ప్రతి వారం ఓ క్రేజీ మూవీ రిలీజ్ కానుండడం ఇటు సినీ ప్రియులకు.. అటు ఇండస్ట్రీ జనాలకు ఉత్సాహాన్నిచ్చే విషయమే. జూన్ మొదటి వారంలో కమల్ హాసన్-మణిరత్నం సినిమా ‘థగ్ లైఫ్’ రాబోతోంది. తమిళంలో భారీ అంచనాాలున్న ఈ సినిమాకు తెలుగులోనూ క్రేజ్ ఉంది. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరి హర వీరమల్లు’ పలుమార్లు వాయిదా పడి.. చివరికి జూన్ 12కు ఫిక్స్ అయింది.
ఈసారి రిలీజ్ విషయంలో సందేహాలేమీ లేవు. పక్కాగా ఆ రోజు వచ్చేస్తుంది. మూడో వారానికి అక్కినేని నాగార్జున-ధనుష్ల ‘కుబేర’ షెడ్యూల్ అయింది. ఆ సినిమా కూడా తెలుగు-తమిళ భాషల్లో మంచి అంచనాల మధ్య విడుదల కాబోతోంది. తర్వాతి వారం మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ విడుదల కానుంది. ప్రభాస్ కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమాకూ మంచి హైప్ ఉంది. ఇక జులై 4న రానున్న విజయ్ దేవరకొండ మూవీ ‘కింగ్డమ్’ మీదా భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలతో నెల రోజుల పాటు బాక్సాఫీస్ కళకళలాడడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on May 18, 2025 7:33 am
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…