
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఎమ్ఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా తన రేంజ్ ను పెంచుకుంది. ఇక తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించింది.

కియారా నటనతో పాటు ఆమె అందం, స్టైల్తో అభిమానులను ఆకర్షిస్తుంది. మెట్ గాలా 2025లో కియారా తన బేబీ బంప్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె బంగారు రంగు టాప్, నలుపు గౌన్, తెల్లని క్లాత్తో అద్భుతంగా కనిపించింది. ఈ డ్రెస్ను గౌరవ్ గుప్తా డిజైన్ చేశారు. కియారా ఈ ఈవెంట్లో తన ప్రెగ్నెన్సీ గ్లోతో మరింత అందంగా కనిపించింది. ఆమె చేతుల్లో రింగ్స్, సింపుల్ నెక్లెస్ ఆమె లుక్ను హైలెట్ చేశాయి.

కియారా 2023లో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ శేర్షా సినిమా సెట్లో మొదలైంది. 2025 ఫిబ్రవరిలో వీరు తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఇక కియారా ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంది. వార్ 2 లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్తో కనిపించనుంది. అలాగే టాక్సిక్ అనే కన్నడ పాన్ ఇండియా సినిమాలో యష్తో నటిస్తోంది. మరి ఈ సినిమాలు అమ్మడికి ఏ స్థాయిలో విజయాలను అందిస్తాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates