హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా పరుగులు పెడుతోంది. మే ఎనిమిది లేదా తొమ్మిది తేదీల్లో గుమ్మడికాయ కొట్టడం దాదాపు ఫిక్స్. ఇక డబ్బింగ్ ఇతరత్రా కార్యక్రమాలు మూడో వారంలోగా పూర్తి చేయాలనేది టార్గెట్. ఇప్పుడు అసలు సవాల్ విడుదల తేదీ. మే 30 కింగ్ డమ్ ఉంది. ఒకవేళ అదే తేదీ కావాలనుకుంటే సితార సంస్థ వాయిదా వేసుకోవడానికి వెనుకాడదు. కాకపోతే వీలైనంత ముందుగా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా కొత్త డేట్ ఏది వేసుకోవాలో విజయ్ దేవరకొండ టీమ్ ప్లాన్ చేసుకుంటుంది.
లేదూ వీరమల్లు జూన్ మొదటి వారంలో రావాలంటే కమల్ హాసన్ తగ్ లైఫ్ ఉంది. దాని వల్ల తెలుగు వర్షన్ కొచ్చిన ఇబ్బందేం లేదు కానీ తమిళనాడు, కేరళలో పవన్ సినిమాని మార్కెట్ చేసుకోవడం, థియేటర్లు దక్కించుకోవడం కష్టమవుతుంది. పైగా బజ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల వీరమల్లు ప్రమోషన్ల మీద దృష్టి పెట్టేందుకు అవసరమైనంత సమయం దక్కేలా చూసుకోవడం అవసరం. అలాంటప్పుడు కమల్ తో క్లాష్ ఎంతవరకు సేఫనేది రకరకాల సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. అదే నెలలో కుబేర, కన్నప్పలు ఉన్నాయి. ఒకవేళ పవన్ వస్తానంటే నాగార్జున, మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఎందుకంటే కన్నప్ప, కుబేరలు కూడా ఇప్పటికే విపరీతమైన జాప్యానికి గురయ్యాయి. ఇంతకన్నా లేట్ చేయడానికి లేదు. ఒకవేళ వీటిలో ఏదైనా లేదా హరిహరవీరమల్లు కనక జూన్ వద్దనుకుంటే మిగిలింది జూలై ఒక్కటే. ఆగస్ట్ లో వార్ 2, కూలి దృష్ట్యా ఛాన్స్ లేదు. పార్ట్ 2 బిజినెస్ కు పార్ట్ 1 సక్సెస్ కీలకం కాబట్టి వీరమల్లుకి సోలో రిలీజ్ చాలా ముఖ్యం. నిర్మాత ఏఎం రత్నం వీలైనంత వరకు అదే ప్రయత్నంలో ఉన్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. పవన్ రిక్వెస్ట్ మేరకు త్రివిక్రమ్ కొంత పర్యవేక్షణ చేస్తున్నారనే టాక్ వచ్చింది కానీ అదేమీ లేదు. కేవలం పలకరింపు కోసమే వచ్చారట.
This post was last modified on May 5, 2025 5:52 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…