హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా పరుగులు పెడుతోంది. మే ఎనిమిది లేదా తొమ్మిది తేదీల్లో గుమ్మడికాయ కొట్టడం దాదాపు ఫిక్స్. ఇక డబ్బింగ్ ఇతరత్రా కార్యక్రమాలు మూడో వారంలోగా పూర్తి చేయాలనేది టార్గెట్. ఇప్పుడు అసలు సవాల్ విడుదల తేదీ. మే 30 కింగ్ డమ్ ఉంది. ఒకవేళ అదే తేదీ కావాలనుకుంటే సితార సంస్థ వాయిదా వేసుకోవడానికి వెనుకాడదు. కాకపోతే వీలైనంత ముందుగా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా కొత్త డేట్ ఏది వేసుకోవాలో విజయ్ దేవరకొండ టీమ్ ప్లాన్ చేసుకుంటుంది.
లేదూ వీరమల్లు జూన్ మొదటి వారంలో రావాలంటే కమల్ హాసన్ తగ్ లైఫ్ ఉంది. దాని వల్ల తెలుగు వర్షన్ కొచ్చిన ఇబ్బందేం లేదు కానీ తమిళనాడు, కేరళలో పవన్ సినిమాని మార్కెట్ చేసుకోవడం, థియేటర్లు దక్కించుకోవడం కష్టమవుతుంది. పైగా బజ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల వీరమల్లు ప్రమోషన్ల మీద దృష్టి పెట్టేందుకు అవసరమైనంత సమయం దక్కేలా చూసుకోవడం అవసరం. అలాంటప్పుడు కమల్ తో క్లాష్ ఎంతవరకు సేఫనేది రకరకాల సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. అదే నెలలో కుబేర, కన్నప్పలు ఉన్నాయి. ఒకవేళ పవన్ వస్తానంటే నాగార్జున, మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఎందుకంటే కన్నప్ప, కుబేరలు కూడా ఇప్పటికే విపరీతమైన జాప్యానికి గురయ్యాయి. ఇంతకన్నా లేట్ చేయడానికి లేదు. ఒకవేళ వీటిలో ఏదైనా లేదా హరిహరవీరమల్లు కనక జూన్ వద్దనుకుంటే మిగిలింది జూలై ఒక్కటే. ఆగస్ట్ లో వార్ 2, కూలి దృష్ట్యా ఛాన్స్ లేదు. పార్ట్ 2 బిజినెస్ కు పార్ట్ 1 సక్సెస్ కీలకం కాబట్టి వీరమల్లుకి సోలో రిలీజ్ చాలా ముఖ్యం. నిర్మాత ఏఎం రత్నం వీలైనంత వరకు అదే ప్రయత్నంలో ఉన్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. పవన్ రిక్వెస్ట్ మేరకు త్రివిక్రమ్ కొంత పర్యవేక్షణ చేస్తున్నారనే టాక్ వచ్చింది కానీ అదేమీ లేదు. కేవలం పలకరింపు కోసమే వచ్చారట.
This post was last modified on May 5, 2025 5:52 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…