ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ సమయంలోనే హిట్ 3 ది థర్డ్ కేస్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ఉండగా ఆంధ్రప్రదేశ్ జిఓ ఆలస్యం కారణంగా ఆన్ లైన్ అమ్మకాలు ఇంకా ప్రారంభం కాకపోవడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టింది. రైల్వే కోడూరు లాంటి చిన్న సెంటర్స్ లో మిడ్ నైట్ షోలు పెట్టడం గమనార్షం. ఏ నిమిషమైనా జిఓ వచ్చేసి సేల్స్ మొదలైపోతాయి కానీ ఇదంతా ఒక రెండు రోజులు ముందుగా జరిగి ఉంటే బాగుండేదని అభిమానులు ఫీలవుతున్నారు. ప్రీ రిలీజ్ బజ్ ఆశించిన దానికన్నా ఎక్కువే కనిపిస్తోంది. ఇక పట్టుదల మ్యాటరేంటో చూద్దాం.
దసరా బ్లాక్ బస్టర్ ఫలితం చూశాక నాని ఎక్కువగా మాస్ ని టార్గెట్ చేసుకుంటున్న వైనం కథల ఎంపికలో కనిపిస్తోంది. మధ్యలో హాయ్ నాన్న చేసినప్పటికీ సరిపోదా శనివారంతో తన ప్రాధాన్యం ఏ జానర్లకు ఎక్కువ ఉందో స్పష్టం చేశాడు. టాప్ లీగ్ లోకి దూసుకుపోవడానికి ఎలాంటి సబ్జెక్టులు కావాలో వాటిని ఆచితూచి ఎంచుకుంటున్నాడు. హిట్ 3లో వయొలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందుకే. ప్యారడైజ్ లో హీరో మీద బోల్డ్ క్యారెక్టరైజేషన్ పెట్టినా ఎస్ చెప్పింది కూడా అందుకే. సో హిట్ 3 కనక బ్లాక్ బస్టర్ అయితే తన నమ్మకం మరింత బలపడి మార్కెట్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.
తెలుగులోనే కాదు పోటీ ఎంత ఉన్నా సరే హిట్ 3 ఇతర భాషల్లోనూ సత్తా చూపుతుందని నమ్ముతున్నాడు. తమిళంలో రెట్రో – టూరిస్ట్ ఫామిలీ, హిందీలో రైడ్ 2, హాలీవుడ్ మూవీ థండర్ బోల్ట్స్ కాంపిటీషన్ ఇస్తున్నా సరే కంటెంట్ అందరినీ మెప్పిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. హింస ఎక్కువగా ఉంటుంది కుటుంబ ప్రేక్షకులను దూరంగా ఉండమని ఒక స్టార్ హీరో స్టేట్ మెంట్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. దీన్ని బట్టే నాని లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత బడ్జెట్, పట్టుదలను పెట్టుబడిగా పెట్టిన నానికి ఎలాంటి ఫలితం దక్కబోతోందో రేపీ సమయానికి తెలిసిపోతుంది. చూద్దాం.
This post was last modified on April 30, 2025 2:19 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…