ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. లాస్ట్ వీక్ భారీ అంచనాల మధ్య వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోవడంతో ఇప్పుడు అందరి కళ్ళు ఏప్రిల్ 25 మీదున్నాయి. మే ఒకటి నాని హిట్ 3 ది థర్డ్ కేస్ వస్తున్న నేపథ్యంలో ఆలోగా థియేటర్ ఫీడింగ్ కి ఇవి ఎంతమేరకు ఉపయోగపడతాయోనని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘సారంగపాణి జాతకం’ మీద కామెడీ లవర్స్ కు మంచి అంచనాలున్నాయి. రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్విస్తామని టీమ్ ధీమాగా చెబుతోంది. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంది.
త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం ‘చౌర్య పాఠం’కు బజ్ పెంచే ప్రయత్నాలు జోరుగా ఉన్నాయి. ట్రైలర్ చూశాక ఏదో వెరైటీ ఫన్ రైడ్ అనిపిస్తోంది. అదే సినిమా మొత్తం ఉంటే టాక్ తో జనాన్ని రప్పించొచ్చు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘అలపుజా జింఖానా’ తెలుగు డబ్బింగ్ ప్రేమలు తరహాలో మేజిక్ చేస్తుందనే నమ్మకం సదరు బృందంలో కనిపిస్తోంది. ఇవి కాకుండా ఎర్రచీర, శివ శంభో, సూర్యాపేట జంక్షన్, సర్వం సిద్ధం, హలో బేబీ, 6 జర్నీ, మన ఇద్దరి ప్రేమకథలు బరిలో ఉన్నాయి. వీటిలో ఒకటో రెండో చివరి నిమిషంలో వాయిదా మంత్రం పఠిస్తే చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే లిస్టులో తోడయ్యాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బాషా’ని రీ రిలీజ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘అశోక్’ కూడా ప్లాన్ చేశారు కానీ బుకింగ్స్ మొదలుపెట్టాక క్యాన్సిల్ చేయడం గమనార్షం. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’కి నిర్మాతలు భారీ స్పందన ఆశిస్తున్నారు. బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ ‘గ్రౌండ్ జీరో’ మీద ట్రైలర్ వచ్చాక బజ్ పెరిగింది. సో ఏప్రిల్ చివరి వారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ ఏవి టాక్ తో జనాన్ని థియేటర్లకు రప్పిస్తాయో చూడాలి. అసలే ఎండలు దానికి తోడు ఐపీఎల్ మ్యాచులు. తిరిగి వారం తర్వాత హిట్ 3 మీద నెలకొన్న భారీ అంచనాలు. వీటిని తట్టుకుని పైన చెప్పిన సినిమాల్లో ఏవి విజేతలుగా నిలుస్తాయో చూడాలి.
This post was last modified on April 22, 2025 5:18 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…