స్టార్ హీరోయిన్ తమన్నా.. అప్ కమింగ్ హీరో సత్యదేవ్ జంటగా ఇటీవలే గుర్తుందా శీతాకాలం పేరుతో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కన్నడలో విజయవంతమైన ‘లవ్ మాక్టైల్’కు ఇది రీమేక్. ఈ సినిమా గురించి ఘనంగా ప్రకటన చేశారు. ప్రారంభోత్సవం కూడా జరిపారు. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకున్న దశలో తమన్నా కరోనా బారిన పడింది. వైరస్ నుంచి కోలుకున్నాక ఆమె ఈ సినిమా చిత్రీకరణలోనే పాల్గొనడానికి సిద్ధమైనట్లు కనిపించింది.
కానీ ఇంతలో ఈ సినిమా ఆగిపోయిందంటూ కొన్ని రోజుల కిందట వార్తలు హల్చల్ చేశాయి. బడ్జెట్ సమస్యల వల్ల గుర్తుందా శీతాకాలం సినిమాను ఆపేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లుగా చెప్పుకున్నారు.దీని మీద చిత్ర బృందం నుంచి అధికారికంగా ఖండన ఏదీ లేకపోవడంతో ఈ వార్త నిజమేనేమో అన్న సందేహాలు కలిగాయి.
ఐతే ఎట్టకేలకు చిత్ర బృందం ఈ వార్తలపై స్పందించింది. సినిమా ఆగిపోయిందన్న ప్రచారం గురించి ఏమీ మాట్లాడుకుండా.. ఒక అప్పీల్తో జనాల ముందుకొచ్చింది. ఈ సినిమాలో సత్యదేవ్ చిన్నప్పటి పాత్ర చేయడానికి 12-15 ఏళ్ల వయసున్న కుర్రాడు కావాలన్నదే ఆ అప్పీల్. తద్వారా ఈ సినిమా ఉందని, ముందు అనుకున్న కాస్ట్ అండ్ క్రూలో కూడా ఏ మార్పూ లేదని చెప్పకనే చెప్పింది.
తమన్నా తప్పుకోవడం వల్లే సినిమా ఆగిందని అన్నారు కానీ.. ఈ అప్పీల్ గురించి పోస్ట్ చేసిన పీఆర్వోలందరూ సత్యదేవ్ సరసన తమన్నానే ఈ సినిమాలో నటించబోతోందని పేర్కొన్నారు. మరి తమన్నాతో ఏ సమస్యా లేదా లేక ఏదైనా ఉంటే పరిష్కరించుకున్నారా అన్నది తెలియదు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సత్యదేవ్కు ఇలా సినిమా ఆగిపోయిందంటే నెగెటివ్ అవుతుంది. కాబట్టి అతడికి ఇబ్బంది లేదన్నమాటే.
This post was last modified on November 2, 2020 11:00 am
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…