స్టార్ హీరోయిన్ తమన్నా.. అప్ కమింగ్ హీరో సత్యదేవ్ జంటగా ఇటీవలే గుర్తుందా శీతాకాలం పేరుతో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కన్నడలో విజయవంతమైన ‘లవ్ మాక్టైల్’కు ఇది రీమేక్. ఈ సినిమా గురించి ఘనంగా ప్రకటన చేశారు. ప్రారంభోత్సవం కూడా జరిపారు. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకున్న దశలో తమన్నా కరోనా బారిన పడింది. వైరస్ నుంచి కోలుకున్నాక ఆమె ఈ సినిమా చిత్రీకరణలోనే పాల్గొనడానికి సిద్ధమైనట్లు కనిపించింది.
కానీ ఇంతలో ఈ సినిమా ఆగిపోయిందంటూ కొన్ని రోజుల కిందట వార్తలు హల్చల్ చేశాయి. బడ్జెట్ సమస్యల వల్ల గుర్తుందా శీతాకాలం సినిమాను ఆపేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లుగా చెప్పుకున్నారు.దీని మీద చిత్ర బృందం నుంచి అధికారికంగా ఖండన ఏదీ లేకపోవడంతో ఈ వార్త నిజమేనేమో అన్న సందేహాలు కలిగాయి.
ఐతే ఎట్టకేలకు చిత్ర బృందం ఈ వార్తలపై స్పందించింది. సినిమా ఆగిపోయిందన్న ప్రచారం గురించి ఏమీ మాట్లాడుకుండా.. ఒక అప్పీల్తో జనాల ముందుకొచ్చింది. ఈ సినిమాలో సత్యదేవ్ చిన్నప్పటి పాత్ర చేయడానికి 12-15 ఏళ్ల వయసున్న కుర్రాడు కావాలన్నదే ఆ అప్పీల్. తద్వారా ఈ సినిమా ఉందని, ముందు అనుకున్న కాస్ట్ అండ్ క్రూలో కూడా ఏ మార్పూ లేదని చెప్పకనే చెప్పింది.
తమన్నా తప్పుకోవడం వల్లే సినిమా ఆగిందని అన్నారు కానీ.. ఈ అప్పీల్ గురించి పోస్ట్ చేసిన పీఆర్వోలందరూ సత్యదేవ్ సరసన తమన్నానే ఈ సినిమాలో నటించబోతోందని పేర్కొన్నారు. మరి తమన్నాతో ఏ సమస్యా లేదా లేక ఏదైనా ఉంటే పరిష్కరించుకున్నారా అన్నది తెలియదు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సత్యదేవ్కు ఇలా సినిమా ఆగిపోయిందంటే నెగెటివ్ అవుతుంది. కాబట్టి అతడికి ఇబ్బంది లేదన్నమాటే.
This post was last modified on November 2, 2020 11:00 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…