వాయిదాల పర్వంలో మునిగి తేలుతున్న హరిహర వీరమల్లు మే 9 విడుదల కావడం ఖరారేనని యూనిట్ వర్గాలు అంటున్నా ప్రమోషన్లు పూర్తి స్థాయిలో మొదలుకాకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పోస్ట్ పోన్ల వల్ల ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఆశించిన బజ్ లేదు. పోస్టర్లు, పాటలు అంత ఎగ్జైట్ మెంట్ ఇవ్వలేకపోయాయి. నిన్న పెద్ది గ్లిమ్ప్స్ చూపించిన ప్రభావం లాంటిది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ అలాంటి సూచనేమి నిర్మాత వైపు నుంచి కనిపించడం లేదు. ఇంకొక్క నాలుగైదు రోజులు పవన్ డేట్లు ఇస్తే మొత్తం షూటింగ్ అయిపోతుందనే లీక్ తప్ప ఎలాంటి సమాచారం రాలేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో ఉన్నారు. వచ్చే వారం అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలో బిజీ అవుతారు. మధ్యలో మంత్రివర్గ సమావేశాలు, జనసేన సమీక్షలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కాల్ షీట్లు ఇవ్వడం అంత సులభంగా లేదు. ఇంకా డబ్బింగ్ జరగాలి. సెన్సార్ కు వెళ్ళాలి. టైం చూస్తే నెల రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈలోగా ఈవెంట్లు, పబ్లిసిటీ అన్నీ చేసుకోవాలి. అన్ని భాషల్లో రిలీజ్ కాబట్టి ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు తిరగాలి. పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం తక్కువ కాబట్టి మిగిలిన క్యాస్టింగ్ తో బజ్ పెంచడం సులభం కాదు.
ఒకవేళ మళ్ళీ వాయిదా అంటే ఇబ్బందులు తప్పవు. వీలైనంత త్వరగా జనం దృష్టిలో హరిహర వీరమల్లు పడేలా ప్రచార పర్వానికి తెరతీయాలి. ఎంత పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే స్వంత అభిమానుల్లోనే దీని పట్ల సానుకూలత కనిపించనప్పుడు బయటి ఆడియన్స్ లో ఆసక్తి రేగడం కష్టం. ముందు ఈ గ్యాప్ సరిచేయాలి. అది పవన్ కళ్యాణ్ దిగితే అవుతుందని చెప్పడం లేదు. సరైన ట్రైలర్, మీడియాతో ముఖాముఖీలు, రెండు మూడు ఈవెంట్లతో పని కానివ్వొచ్చు. ఎటొచ్చి దర్శకుడు జ్యోతికృష్ణతో సహా టీమ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ ఉంది. అడుగుదామా అంటే నిర్మాత దొరకట్లేదు. చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on April 7, 2025 7:48 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…