Political News

ఒక్క సీటు కూడా రాలేదు.. కానీ పవన్ ఫోకస్ అక్కడే

ఏపీలోని గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన అడవి తల్లి బాట కార్యక్రమాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పరిధిలోని డుంబ్రిగూడ మండలం పెదపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు గిరిజన గూడేలంటే ఇష్టమని… అందుకే ఇకపై గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యం లేదన్న మాటే వినిపించకూడదన్న భావనతోనే అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టామన్నారు.

ఇకపై డోలీ మోతలు ఉండవని ప్రకటించిన పవన్… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,005 కోట్లతో 1,069 కిలో మీటర్ల మేర రోడ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ రోడ్లతో రాష్ట్రంలోని రోడ్డు సౌకర్యం లేని గిరిజన గూడేల్లో 601 గూడేలకు రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక మిగిలిన 500 పై చిలుకు గూడేలకు వచ్చే ఏడాది రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా వైసీపీ పాలనను గుర్తు చేసిన పవన్… ఐధేళ్ల వైసీపీ పాలనలో కేవలం 90 కోట్లనే గిరిజన గూడేల రోడ్లకు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాకుండానే రూ.1,005 కోట్ల నిధులను గిరిజన గూడేల రోడ్లకు కేటాయించామన్నారు. భవిష్యత్తులో గిరిజన గూడేల రూపూరేఖలను సమూలంగా మారుస్తామని ఆయన చెప్పారు. గిరిజన గూడేలకు రోడ్డు సైౌకర్యం కోసం అడిగిన వెంటనే సీఎం నారా చంద్రబాబునాయుడు నిధులు విడుదల చేశారని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి మెజారిటీ నిధులను సేకరించామని, రాష్ట్ర ప్రభుత్వం తన గ్రాంట్ గా కొంత మేర నిధులను కూడా కేటాయించిందన్నారు. ఇప్పటికే ఈ పనులకు సంబందించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని పవన్ చెప్పారు. ఏదో చెప్పడం, ఆ తర్వాత మరిచిపోవడం కాకుండా.. అతి త్వరలోనే ఈ పనులను ప్రారంభించడంతో పాటుగా నిర్ధీత కాల వ్యవధిలోగా పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అరకులో కూటమికి ఒక్క సీటు కూడా రాలేదని పవన్ గుర్తు చేశారు. వైసీపీని నమ్మి వారికి ఓటేస్తే… ఐదేళ్ల పాటు వారు అరకును విస్మరించారని ఆయన అన్నారు. కూటమికి ఓటు వేయకున్నా అరకు అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కదులుతున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి చూసి అయినా వచ్చే ఎన్నికల్లో అరకు మొత్తంలో కూటమి జెండాలు రెపరెపలాడాలని ఆయన అభిలషించారు. కూటమిని ఆశీర్వదిస్తే అభివృద్ధి దానంతటదే వస్తుందన్నారు.

కూటమి ఇంకో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఎలాగైతే 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతుందో… ఏపీలోనూ కూటమి పాలన 15 ఏళ్ల పాటు కొనసాగుతుందన్నారు. ఏడాది తిరక్కుండానే తాము చేస్తున్న పనులను చూసైనా అరకు జనం వచ్చే ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారని తాను విశ్వసిస్తున్నానని పవన్ అన్నారు. పెదపాడులో సోమవారం పర్యటన ముగించుకుని విశాఖ వెళ్లనున్న పవన్… మంగళవారం కూడా అరకు మండలం సుంకరమెట్టకు వెళ్లనున్నారు అక్కడ కొత్తగా నిర్మించిన ఉడెన్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించనున్నారు.

This post was last modified on April 7, 2025 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

34 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago