మార్చి 28 విడుదల కాబోతున్న మ్యాడ్ స్క్వేర్ బృందం అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ ఇవ్వబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే పాటలు ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో కాకుండా ఈ బాధ్యతను వేరొకరికి ఎందుకు ఇచ్చినట్టు. ఇన్ సైడ్ టాక్ అయితే చిరు – రావిపూడి ప్రాజెక్టు సిట్టింగ్స్ లో బిజీగా ఉండటం వల్లే భీమ్స్ దీనికి తగినంత సమయం కేటాయించలేదని అంటున్నారు. కానీ మంచి బిజిఎం వల్ల మరింత ఎలివేట్ అవుతుందనే ఉద్దేశంతో పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు జరిగిందని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది.
కారణం ఏదైనా ఇలా వేరొకరి పాటలు కంపోజ్ చేసిన సినిమాకు తమన్ బిజిఎం ఇవ్వడం ఇది మొదటి సారి కాదు. గతంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన డీజే టిల్లుకి తమనే నేపధ్య సంగీతం సమకూర్చాడు. ఆ తర్వాత ప్రభాస్ రాధే శ్యామ్ కి పని చేశాడు. పుష్ప 2 కి వర్క్ చేయడం జరిగింది కానీ తర్వాత ఎందుకనో దేవి, సామ్ లతో సరిపెట్టారు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కి వర్క్ చేయడం ఖచ్చితంగా అవుట్ ఫుట్ కి హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పటిదాకా ఈ విషయాన్ని గుట్టుగా ఉంచిన టీమ్ ఇవాళ హఠాత్తుగా అనౌన్స్ చేయడం విశేషం. తమన్ ఒప్పుకోవడానికి మరో నేపథ్యం ఉంది.
సితార & హారిక హాసిని, తమన్ కాంబోలో మంచి ఆడియోస్ ఉన్నాయి. భీమ్లా నాయక్, డాకు మహారాజ్, అల వైకుంఠపురములో, గుంటూరు కారం ఇలా వీళ్ళ కొలాబరేషన్ ఏళ్ళ తరబడి సాగుతోంది. అందుకే నాగవంశీ అడగ్గానే తమన్ ఎస్ చెప్పి ఉంటాడు. నితిన్ నార్నె, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ఈ యూత్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ ఉండదు. ప్రియాంకా జవల్కర్ తో స్పెషల్ సాంగ్ పెట్టారు. మొత్తం ఈ ముగ్గురు చుట్టే దర్శకుడు కళ్యాణ్ శంకర్ కథను రాసుకున్నాడు. పోటీ ఎంత ఉన్నప్పటికీ మొదటి భాగంలాగే గట్టిగా హిట్టు కొడతామనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది.
This post was last modified on March 24, 2025 9:25 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…