Political News

రజినీ వర్సెస్ రాయలు… మధ్యలో ఇంకెందరో?

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్ల దందాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వైసీపీ మహిళా నేత, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ నమోదు చేసిన కేసు ఏపీలో రాజకీయ మంటలను రాజేసింది. ఈ కేసు టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే నమోదు అయ్యిందని రజినీ ఆరోపించారు. తాజాగా రజినీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు సోమవారం మీడియా ముందుకు వచ్చిన లావు.. తప్పు చేసి తనపై నిందలేస్తే ఎలాగని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేకున్నా తనను లాగారన్న లావు.. ఈ కథ వెనుక వారందరినీ బయటకు లాగుతానని…ఆ తంతు మొతాన్ని బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పల్నాడు జిల్లా యడ్డవల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం నుంచి రూ.5 కోట్లను డిమాండ్ చేసిన రజినీ…చివరకు రూ.2.20 కోట్లను తీసుకున్నారని చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపట్టి నిర్ధారించగా… తాజాగా ఏసీబీ కూడా ఈ వ్యవహారం నిజమేనని రజినీ సహా ఆమె మరిది, నాడు విజిలెన్స్ అదికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువాలపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై స్పందించేందుకు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం పెట్టిన రజినీ.. లావు శ్రీకృష్ణదేవరాయలుపై సంచలన ఆరోపణలు చేశారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తానుంటున్న పార్టీలోనే ఎంపీగా ఉన్న లావు.. తన కాల్ డేటాతో పాటుగా తన ఫ్యామిలీ మెంబర్ల కాల్ డేటాను తీశారని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు.

రజినీ ఆరోపణలపై లావు కూడా వేగంగానే స్పందించారు. చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నప్పుడు బాగానే ఉందని…దానిపై కేసులు నమోదు అయితే బాధపడిపోతున్నారని లావు విమర్శించారు. అక్రమాలు చేసినప్పుడు తాను గుర్తుకు రాలేన్న లావు… నేడు కేసులు నమోదు అయితే మాత్రం తాను గుర్తుకు వస్తున్నానని… నింద తన మీద వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా తన వ్యక్తిత్వం ఏమిటన్న విషయం పల్నాడు జిల్లా వాసులకు తెలుసునని ఆయన అన్నారు. ఈ కొత్త కథ వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న వారందరినీ బయటకు లాగుతానని, ఇది ఎంతదాకా వెళుతుందో చూద్దామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వారు చేసిన తప్పుల నుంచి బయటపడేందుకు తన పేరు వాడుతున్నారన్న లావు… ఈ గేమ్ ను వారు మొదలుపెట్టారని… దానిని తాను పూర్తి చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు.

వాస్తవానికి ఇటు లావు, అటు రజినీ… ఇద్దరూ 2019 ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ వైసీపీతోనే చట్టసభల్లో అడుగుపెట్టాురు. లావు నరసరావుపేట నుంచి ఎంపీగా గెలవగా… చిలకలూరిపేట నుంచి రజినీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల దాకా ఇద్దరూ వైసీపీలోనే కొనసాగారు. వారి మద్య పెద్దగా విభేదాలున్నట్లుగా కూడా ఏనాడూ వార్తలు వినిపించలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీని వీడిన లావు టీడీపీలో చేరి నరసరావుపేట నుంచే తిరిగీ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే జగన్ ఆదేశాలతో చిలకలూరిపేట వదిలిన రజినీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వచ్చిన రజినీ.. ఎప్పుడూ లావు పేరును ప్రస్తావించలేదు. ఇప్పుడు ఏకంగా ఏసీబీ కేసుతో ఆమె లావు పేరును ప్రస్తావించారు. దీనికి లావు కూడా ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరగడం ఖాయమేనని చెప్పాలి.

This post was last modified on March 24, 2025 12:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

27 minutes ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

33 minutes ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

60 minutes ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

2 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago