Political News

రజినీ వర్సెస్ రాయలు… మధ్యలో ఇంకెందరో?

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్ల దందాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వైసీపీ మహిళా నేత, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ నమోదు చేసిన కేసు ఏపీలో రాజకీయ మంటలను రాజేసింది. ఈ కేసు టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే నమోదు అయ్యిందని రజినీ ఆరోపించారు. తాజాగా రజినీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు సోమవారం మీడియా ముందుకు వచ్చిన లావు.. తప్పు చేసి తనపై నిందలేస్తే ఎలాగని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేకున్నా తనను లాగారన్న లావు.. ఈ కథ వెనుక వారందరినీ బయటకు లాగుతానని…ఆ తంతు మొతాన్ని బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పల్నాడు జిల్లా యడ్డవల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం నుంచి రూ.5 కోట్లను డిమాండ్ చేసిన రజినీ…చివరకు రూ.2.20 కోట్లను తీసుకున్నారని చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపట్టి నిర్ధారించగా… తాజాగా ఏసీబీ కూడా ఈ వ్యవహారం నిజమేనని రజినీ సహా ఆమె మరిది, నాడు విజిలెన్స్ అదికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువాలపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై స్పందించేందుకు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం పెట్టిన రజినీ.. లావు శ్రీకృష్ణదేవరాయలుపై సంచలన ఆరోపణలు చేశారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తానుంటున్న పార్టీలోనే ఎంపీగా ఉన్న లావు.. తన కాల్ డేటాతో పాటుగా తన ఫ్యామిలీ మెంబర్ల కాల్ డేటాను తీశారని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు.

రజినీ ఆరోపణలపై లావు కూడా వేగంగానే స్పందించారు. చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నప్పుడు బాగానే ఉందని…దానిపై కేసులు నమోదు అయితే బాధపడిపోతున్నారని లావు విమర్శించారు. అక్రమాలు చేసినప్పుడు తాను గుర్తుకు రాలేన్న లావు… నేడు కేసులు నమోదు అయితే మాత్రం తాను గుర్తుకు వస్తున్నానని… నింద తన మీద వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా తన వ్యక్తిత్వం ఏమిటన్న విషయం పల్నాడు జిల్లా వాసులకు తెలుసునని ఆయన అన్నారు. ఈ కొత్త కథ వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న వారందరినీ బయటకు లాగుతానని, ఇది ఎంతదాకా వెళుతుందో చూద్దామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వారు చేసిన తప్పుల నుంచి బయటపడేందుకు తన పేరు వాడుతున్నారన్న లావు… ఈ గేమ్ ను వారు మొదలుపెట్టారని… దానిని తాను పూర్తి చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు.

వాస్తవానికి ఇటు లావు, అటు రజినీ… ఇద్దరూ 2019 ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ వైసీపీతోనే చట్టసభల్లో అడుగుపెట్టాురు. లావు నరసరావుపేట నుంచి ఎంపీగా గెలవగా… చిలకలూరిపేట నుంచి రజినీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల దాకా ఇద్దరూ వైసీపీలోనే కొనసాగారు. వారి మద్య పెద్దగా విభేదాలున్నట్లుగా కూడా ఏనాడూ వార్తలు వినిపించలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీని వీడిన లావు టీడీపీలో చేరి నరసరావుపేట నుంచే తిరిగీ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే జగన్ ఆదేశాలతో చిలకలూరిపేట వదిలిన రజినీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వచ్చిన రజినీ.. ఎప్పుడూ లావు పేరును ప్రస్తావించలేదు. ఇప్పుడు ఏకంగా ఏసీబీ కేసుతో ఆమె లావు పేరును ప్రస్తావించారు. దీనికి లావు కూడా ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరగడం ఖాయమేనని చెప్పాలి.

This post was last modified on March 24, 2025 12:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

27 minutes ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

6 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

8 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

8 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

10 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

10 hours ago