బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అంతకంతకూ సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. యాప్స్ మాయలో పడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై దృష్టి సారించారు. వారిపై కేసులు నమోదు చేశారు. విచారణకూ పిలిచేశారు. ఈ క్రమంలో గురువారం పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ మొత్తం పూసగుచ్చినట్లుగా వివరాలు బయటపెట్టేసింది.
అదేదో సామెత చెప్పినట్లుగా ఇలా అడగ్గానే… అలా మొత్త చెప్పేసినట్లుగా విష్ణుప్రియ పోలీసుల విచారణలో ఏ ఒక్క అంశాన్ని కూడా దాచుకోకుండా నిజాయతీగా వ్యవహరించిందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. తాను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన మాట వాస్తవమేనని ఒప్పేసుకున్న విష్ణుప్రియ.. ఆ ప్రమోషన్ ద్వారా తాను భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లుగా కూడా వెల్లడించింది. 15 బెట్టింగ్ యాప్స్ కు తాను ప్రమోషన్ చేసినట్లుగా ఆమె ఒప్పుకుందని సమాచారం
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం తన ఇన్ స్టాగ్రాం ఖాతాను వినియోగించినట్లు విష్ణుప్రియా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంలో తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశానన్న విష్ణుప్రియ.. అంతకుమించి తనకేమీ తెలియదని చెప్పింది. దీంతో విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్ మెంట్లతో పాటు ఆమె మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నోటీసుల మేరకు గురువారం ఉదయం తన న్యాయవాదిని వెంటబెట్టుకుని విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చింది. మధ్యాహ్నం లోగానే విచారణను ముగించిన పోలీసులు ఆమెను వదిలిపెట్టారు.
This post was last modified on March 20, 2025 4:42 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…