బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అంతకంతకూ సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. యాప్స్ మాయలో పడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై దృష్టి సారించారు. వారిపై కేసులు నమోదు చేశారు. విచారణకూ పిలిచేశారు. ఈ క్రమంలో గురువారం పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ మొత్తం పూసగుచ్చినట్లుగా వివరాలు బయటపెట్టేసింది.
అదేదో సామెత చెప్పినట్లుగా ఇలా అడగ్గానే… అలా మొత్త చెప్పేసినట్లుగా విష్ణుప్రియ పోలీసుల విచారణలో ఏ ఒక్క అంశాన్ని కూడా దాచుకోకుండా నిజాయతీగా వ్యవహరించిందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. తాను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన మాట వాస్తవమేనని ఒప్పేసుకున్న విష్ణుప్రియ.. ఆ ప్రమోషన్ ద్వారా తాను భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లుగా కూడా వెల్లడించింది. 15 బెట్టింగ్ యాప్స్ కు తాను ప్రమోషన్ చేసినట్లుగా ఆమె ఒప్పుకుందని సమాచారం
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం తన ఇన్ స్టాగ్రాం ఖాతాను వినియోగించినట్లు విష్ణుప్రియా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంలో తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశానన్న విష్ణుప్రియ.. అంతకుమించి తనకేమీ తెలియదని చెప్పింది. దీంతో విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్ మెంట్లతో పాటు ఆమె మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నోటీసుల మేరకు గురువారం ఉదయం తన న్యాయవాదిని వెంటబెట్టుకుని విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చింది. మధ్యాహ్నం లోగానే విచారణను ముగించిన పోలీసులు ఆమెను వదిలిపెట్టారు.
This post was last modified on March 20, 2025 4:42 pm
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…