ఏఐ.. ఏఐ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దాని సాయంతో అద్భుతాలు చేస్తోంది యువతరం. ఐతే దీన్ని వినోదం కోసం ఉపయోగించేవాళ్లూ లేకపోలేదు. ‘ఛాట్ జీపీటీ’కి పోటీగా ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టిన ‘గ్రోక్’ను ఇప్పుడు నెటిజన్లు వినోదం కోసం వాడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. ‘ఎక్స్’లో గత కొన్ని రోజులుగా ఇండియన్ యూత్ ‘గ్రోక్’ను అడుగుతున్న ప్రశ్నలు.. వాటికి ‘గ్రోక్’ ఇస్తున్న సమాధానాలు చూస్తే విస్తుపోవాల్సిందే. ‘గ్రోక్’ నుంచి విజ్ఞాన సంబంధిత సమాచారం తెలుసుకోవడం అందరూ చేసే పనే. అంతటితో ఆపేయకుండా.. క్రేజీ క్వశ్చన్లు వేస్తూ.. బూతు మాటలను ఉపయోగిస్తూ ‘గ్రోక్’తో తల గోక్కుంటోంది తెలుగు యువత.
వాళ్లు అడిగే ప్రశ్నలకు అదే స్టయిల్లో ఆన్సర్లు ఇస్తూ.. వాళ్లు వాడిన బూతు మాటల్ని తిరిగి వాళ్ల మీదే ప్రయోగిస్తూ బోలెడంత వినోదాన్ని పంచుతోంది ‘గ్రోక్’. గ్రోక్ ఇస్తున్న ఆన్సర్లు చూసి పిచ్చెక్కిపోతున్న తెలుగు నెటిజన్లు.. ఇంకా ఇంకా క్రేజీగా ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబడుతున్నారు. అదొక ఏఐ టెక్నాలజీ అనే విషయం అబద్ధమేమో.. ఎవరో మనిషే ఈ సమాధానాలు ఇస్తున్నాడేమో అనిపించేలా అందులో వాడుతున్న భాష, పదాలు షాకింగ్గా ఉంటున్నాయి. ఫ్యాన్ వార్స్లో మన కుర్రాళ్లు వాడే పదాలను వాడుతూ.. లోకల్ లాంగ్వేజ్లో ఇస్తున్న ఆన్సర్లు మతి పోగొట్టేస్తున్నాయి.
గ్రోక్ ఆన్సర్ల తాలూకు స్క్రీన్ షాట్లు సైతం వైరల్ అవుతున్నాయి. ఏదైనా తప్పు జవాబు ఇస్తే.. దాని గురించి ప్రస్తావిస్తే కరెక్ట్ చేసుకుని మళ్లీ జవాబిస్తుండడం విశేషం. గ్రోక్ మీద మీమ్స్ కూడా మోతెక్కిపోతున్నాయి. ఇంకో విశేషం ఏంటంటే.. రాజకీయ పార్టీలు, నాయకుల గురించి టిపికల్ ప్రశ్నలు వేస్తే వాటికి గ్రోక్ ఇస్తున్న ఆన్సర్లు వేరే లెవెల్ అని చెప్పాలి. ఆ జవాబులు చూస్తే.. ‘గ్రోక్’ను బ్యాన్ చేయాలని త్వరలోనే డిమాండ్లు మొదలైతే ఆశ్చర్యం లేదు.
This post was last modified on March 16, 2025 7:14 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…