Movie News

పాన్ మసాలా హీరోలకు నోటీసులు

జైపూర్‌లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బాలీవుడ్ స్టార్‌లు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌కు నోటీసులు జారీ చేసింది. వీరు ప్రచారం చేసిన పాన్ మసాలా యాడ్ మోసపూరితంగా ఉందని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని, ఆరోగ్యానికి హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నారనే కారణంగా, జైపూర్‌కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

అసలు సమస్య ఏమిటంటే, ఈ యాడ్‌లో “దానె దానె మే కెసర్ కా దమ్” అనే ట్యాగ్‌లైన్ ఉపయోగించారు. కానీ నిజానికి ఈ ఉత్పత్తిలో అసలు కేశర్ (సాఫ్రన్) కలిపి ఉండదని ఆరోపించారు. మార్కెట్‌లో కేశర్ ధర లక్షల్లో ఉంటుంది, కానీ అంత విలువైనది రూ.5ల పాన్ మసాలాలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీంతో జనాల్లో మోసం జరుగుతోందని, తప్పుడు ప్రచారం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని కోర్టుకు వివరించారు.

ఈ కేసులో కేవలం నటులనే కాదు, వాణిజ్య సంస్థ జేబీ ఇండస్ట్రీస్ అధినేత విమల్ కుమార్ అగర్వాల్‌కూ నోటీసులు వెళ్లాయి. న్యాయస్థానం ముద్దాయిలందరికీ మార్చి 19న హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే, వారు లేకుండానే విచారణ కొనసాగించబడుతుందని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నటులు, కంపెనీకి కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసుపై ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఫేమస్ సెలెబ్రిటీల ప్రమోషన్లతో జనాలు తప్పుదారి పడుతున్నారని, తప్పుడు ప్రచారానికి బాధ్యత వహించాలని న్యాయవాది బడియాల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకటనను తక్షణమే బ్యాన్ చేయాలని, వీరు చేసిన తప్పుడు ప్రచారానికి జరిమానా విధించాలని కోర్టును కోరారు. మరి, నటులు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on March 9, 2025 5:33 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

5 hours ago

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

7 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

9 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

12 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

13 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

14 hours ago