పరిమిత బడ్జెట్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తీసి.. బాక్సాఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఆ చిత్రాన్ని నిలబెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దీంతో ఇండస్ట్రీ అంతటా అతడిపై ప్రశంసలు కురిశాయి. భారీ బడ్జెట్, క్రేజీ కాంబినేషన్ల కంటే.. పరిమిత వనరులతోనే ప్రేక్షకులు మెచ్చే వినోదాన్ని అందిస్తే అద్భుతమైన ఫలితం వస్తుందనడానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ కావడానికంటే ముందు.. దీన్ని అనిల్ రావిపూడి అండ్ టీం ప్రమోట్ చేసిన విధానం కూడా ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడే ముందుండి ప్రమోషన్లను నడిపించాడు. ఫన్నీ ఐడియాలతో మేకింగ్ దశ నుంచే సినిమాను వార్తల్లో నిలబెట్టాడు అనిల్.
రిలీజ్ దగ్గర పడేసరికి ప్రమోషన్స్ పీక్స్కు వెళ్లాయి. సినిమా రిలీజైన నెల రోజులకు కూడా ప్రమోషన్లు కొనసాగడం విశేషం. ఈ విషయంలో అనిల్ ఒక రోల్ మోడల్గా మారిపోయాడు అంటే అతిశయోక్తి కాదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాధించిన విజయం చూశాక.. సినిమాను ప్రమోట్ చేస్తే ఇలా చేయాలి అనే ఫీలింగ్ మిగతా మేకర్స్లో కలిగింది. ఈ నెలాఖర్లో విడుదల కాబోతున్న ‘రాబిన్ హుడ్’ సినిమా విషయంలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మోడల్ను ఫాలో అయిపోతోంది టీం. ఈ సినిమాకు కూడా మేకింగ్ దశ నుంచి ఫన్నీగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇందులో దర్శకుడు వెంకీ లీడ్ తీసుకుంటున్నాడు.
పాట రిలీజ్ చేస్తున్నపుడు సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్తో కలిసి అతను చేసిన అల్లరి గురించి తెలిసిందే. ఆ తర్వాత సెట్స్ నుంచి ఇంకో రెండు వీడియోలు వదిలారు. తాజాగా నితిన్ను ప్రమోషన్ల కోసం లాక్ చేసేందుకు అతడి వెంట పడుతున్నట్లు వెంకీ ఒక వీడియో చేశాడు. అది ఫన్నీగా ఉంది. ‘రాబిన్ హుడ్’ టీం నుంచి ఈ వరుస వీడియోలు చూస్తుంటే అందరికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైంలో అనిల్ అండ్ టీం చేసిన సందడే గుర్తుకు వస్తోంది. ‘రాబిన్ హుడ్’ కూడా సక్సెస్ అయితే.. మున్ముందు మిగతా చిత్రాల మేకర్స్ కూడా ఇదే బాట పడతారేమో.
This post was last modified on March 7, 2025 4:08 pm
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…