పరిమిత బడ్జెట్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తీసి.. బాక్సాఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఆ చిత్రాన్ని నిలబెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దీంతో ఇండస్ట్రీ అంతటా అతడిపై ప్రశంసలు కురిశాయి. భారీ బడ్జెట్, క్రేజీ కాంబినేషన్ల కంటే.. పరిమిత వనరులతోనే ప్రేక్షకులు మెచ్చే వినోదాన్ని అందిస్తే అద్భుతమైన ఫలితం వస్తుందనడానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ కావడానికంటే ముందు.. దీన్ని అనిల్ రావిపూడి అండ్ టీం ప్రమోట్ చేసిన విధానం కూడా ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడే ముందుండి ప్రమోషన్లను నడిపించాడు. ఫన్నీ ఐడియాలతో మేకింగ్ దశ నుంచే సినిమాను వార్తల్లో నిలబెట్టాడు అనిల్.
రిలీజ్ దగ్గర పడేసరికి ప్రమోషన్స్ పీక్స్కు వెళ్లాయి. సినిమా రిలీజైన నెల రోజులకు కూడా ప్రమోషన్లు కొనసాగడం విశేషం. ఈ విషయంలో అనిల్ ఒక రోల్ మోడల్గా మారిపోయాడు అంటే అతిశయోక్తి కాదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాధించిన విజయం చూశాక.. సినిమాను ప్రమోట్ చేస్తే ఇలా చేయాలి అనే ఫీలింగ్ మిగతా మేకర్స్లో కలిగింది. ఈ నెలాఖర్లో విడుదల కాబోతున్న ‘రాబిన్ హుడ్’ సినిమా విషయంలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మోడల్ను ఫాలో అయిపోతోంది టీం. ఈ సినిమాకు కూడా మేకింగ్ దశ నుంచి ఫన్నీగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇందులో దర్శకుడు వెంకీ లీడ్ తీసుకుంటున్నాడు.
పాట రిలీజ్ చేస్తున్నపుడు సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్తో కలిసి అతను చేసిన అల్లరి గురించి తెలిసిందే. ఆ తర్వాత సెట్స్ నుంచి ఇంకో రెండు వీడియోలు వదిలారు. తాజాగా నితిన్ను ప్రమోషన్ల కోసం లాక్ చేసేందుకు అతడి వెంట పడుతున్నట్లు వెంకీ ఒక వీడియో చేశాడు. అది ఫన్నీగా ఉంది. ‘రాబిన్ హుడ్’ టీం నుంచి ఈ వరుస వీడియోలు చూస్తుంటే అందరికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైంలో అనిల్ అండ్ టీం చేసిన సందడే గుర్తుకు వస్తోంది. ‘రాబిన్ హుడ్’ కూడా సక్సెస్ అయితే.. మున్ముందు మిగతా చిత్రాల మేకర్స్ కూడా ఇదే బాట పడతారేమో.
This post was last modified on March 7, 2025 4:08 pm
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…