Movie News

అజిత్ కోసం ధనుష్ త్యాగం చేశాడా ?

ఒకరి కోసం మరొక హీరో సర్దుబాటు చేసుకోవమనేది ఇండస్ట్రీలో తరచుగా గమనిస్తూ ఉంటాం. బాహుబలికి దారి వదలడం కోసం శ్రీమంతుడుని మహేష్ బాబు పోస్ట్ పోన్ చేయించడం గురించి అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే కానీ అసలు ట్విస్టులు వేరే ఉన్నాయి. ధనుష్ నటించి దర్శకత్వం వహించిన ఇడ్లీ కడాయి ఏప్రిల్ 10 విడుదలవుతుందని మూడు నెలల క్రితమే ప్రకటించారు. అయితే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ హఠాత్తుగా అదే తేదీకి వస్తామని అనౌన్స్ చేయడంతో రెండూ క్లాష్ అవ్వడం వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయని బయ్యర్లు టెన్షన్ పడ్డారు.

దానికి పరిష్కారం దొరికేసింది. ఇడ్లీ కడాయిని వాయిదా వేశారు. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ త్వరలోనే క్లారిటీ ఇస్తారు. ధనుష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అజిత్ ఇంతకు ముందే అంగీకారం తెలపడం వల్లే ఈ అడ్జస్ట్ మెంట్ జరిగిందనేది చెన్నై టాక్. కానీ వాస్తవాలు వేరు. ఇడ్లీ కడాయి షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. కొంత టాకీ పార్ట్, విదేశాల్లో షూట్ చేయాల్సిన పాట ఒకటి బాలన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కావాలట. పైగా ఇటీవలే రిలీజైన జాబిలమ్మ నీకు అంత కోపమా కోసం కొంత బ్రేక్ తీసుకున్న ధనుష్ తర్వాత బాలీవుడ్ మూవీ తేరి మేరీ ఇష్క్ సెట్స్ కు వెళ్ళిపోయాడు.

దీంతో ఏప్రిల్ 10ని ఇడ్లీ కడాయి అందుకోలేని పరిస్థితి తలెత్తింది. ఈ కారణంగానే తప్పుకోక తప్పలేదు. అంతే తప్ప అజిత్ కోసం త్యాగం చేయడం లాంటి సీన్లేమి లేవని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మీద బజ్ చూస్తుంటే దానికి కాంపిటీషన్ ఇవ్వకపోవడమే ఉత్తమం. ఇతర బాషల సంగతేమో కానీ తమిళంలో మాత్రం రికార్డులు బద్దలయ్యే ఓపెనింగ్స్ రావడం ఖాయం. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తోంది. అన్నట్టు ఇడ్లీ కడాయి ఫ్రెష్ గా జూలై లేదా ఆగస్ట్ ఆప్షన్లను చూస్తోందని టాక్.

This post was last modified on March 4, 2025 12:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

24 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago