వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ అతి త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదన్న వాదనలు అంతకంతకూ బలపడున్నాయి. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేయగా… కేవలం కొన్ని అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఆమె అరెస్టుకు మరికాస్త సమయం పట్టవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ… జగన్ సెకండ్ కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో రజనీని జగన్ చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చగా… ఆమె ఓటమిపాలయ్యారు. అంతకుముందు ఆమె టీడీపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు.
ఇక ఇప్పుడు రజనీని కష్టాల పాలు చేసిన కేసు వివరాల్లోకి వెళితే… మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రజనీ వసూళ్ల పర్వానికి తెర తీశారని ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి ఆమె ఏకంగా రూ.2.20 కోట్లను వసూలు చేశారట. ఈ మేరకు కీలక సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ జరపగా… ఈ ఆరోపణలు నిజమేనని తేలింది. పన్నులు ఎగ్గొట్టారంటూ నాటి విజినెన్స్ ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువా నుంచి క్రషర్ యజమానులను రజనీ బెదిరించారట. రూ.5 కోట్లు ఇస్తే.. సమస్య పరిష్కారం అయిపోతుందని రజనీ పీఏ వారికి సూచించారట. ఈ క్రమంలో రజనీతో చర్చలకు క్రషర్ యజమానులు సిద్ధపడగా… అంతిమంగా రూ.2.20 కోట్లకు డీల్ కుదిరిందట. ఈ మొత్తంలో రజనీకి రూ.2 కోట్లు అందగా… ఐపీఎస్ జాషువాకు రూ.10 లక్షలు, రజనీ పీఏకు రూ.10 లక్షలు ముట్టాయట.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టిన విజిలెన్స్ శాఖ… ఈ ఆరోపణలు వాస్తవమేనని నిగ్దు తేల్చింది. ఈ నివేదికను ఇదివరకే ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇప్పటికే దృష్టి సారించింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాపై కేసు నమోదుతో పాటు విచారణ చేసేందుకు అనుమతించాలన్న ఏసీబీ అభ్యర్థనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. తాజాగా రజనీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతించాలంటూ గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది. ఈ మేరకు గవర్నర్ నుంచి అనుమతి రాగానే… రజనీపై కేసు నమోదు చేయడంతో పాటు ఆమెను విచారించేందుకు ఏసీబీ రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. ఎలాగూ నేరం ఇప్పటికే నిరూపితమైన నేపథ్యంలో రజనీ అరెస్టు ఖాయమేనని చెప్పాలి.
This post was last modified on March 4, 2025 11:46 am
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…