Political News

విడదల రజనీ జైలుకు వెళ్లక తప్పదా..?

వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ అతి త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదన్న వాదనలు అంతకంతకూ బలపడున్నాయి. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేయగా… కేవలం కొన్ని అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఆమె అరెస్టుకు మరికాస్త సమయం పట్టవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ… జగన్ సెకండ్ కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో రజనీని జగన్ చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చగా… ఆమె ఓటమిపాలయ్యారు. అంతకుముందు ఆమె టీడీపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు.

ఇక ఇప్పుడు రజనీని కష్టాల పాలు చేసిన కేసు వివరాల్లోకి వెళితే… మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రజనీ వసూళ్ల పర్వానికి తెర తీశారని ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి ఆమె ఏకంగా రూ.2.20 కోట్లను వసూలు చేశారట. ఈ మేరకు కీలక సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ జరపగా… ఈ ఆరోపణలు నిజమేనని తేలింది. పన్నులు ఎగ్గొట్టారంటూ నాటి విజినెన్స్ ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువా నుంచి క్రషర్ యజమానులను రజనీ బెదిరించారట. రూ.5 కోట్లు ఇస్తే.. సమస్య పరిష్కారం అయిపోతుందని రజనీ పీఏ వారికి సూచించారట. ఈ క్రమంలో రజనీతో చర్చలకు క్రషర్ యజమానులు సిద్ధపడగా… అంతిమంగా రూ.2.20 కోట్లకు డీల్ కుదిరిందట. ఈ మొత్తంలో రజనీకి రూ.2 కోట్లు అందగా… ఐపీఎస్ జాషువాకు రూ.10 లక్షలు, రజనీ పీఏకు రూ.10 లక్షలు ముట్టాయట.

ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టిన విజిలెన్స్ శాఖ… ఈ ఆరోపణలు వాస్తవమేనని నిగ్దు తేల్చింది. ఈ నివేదికను ఇదివరకే ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇప్పటికే దృష్టి సారించింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాపై కేసు నమోదుతో పాటు విచారణ చేసేందుకు అనుమతించాలన్న ఏసీబీ అభ్యర్థనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. తాజాగా రజనీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతించాలంటూ గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది. ఈ మేరకు గవర్నర్ నుంచి అనుమతి రాగానే… రజనీపై కేసు నమోదు చేయడంతో పాటు ఆమెను విచారించేందుకు ఏసీబీ రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. ఎలాగూ నేరం ఇప్పటికే నిరూపితమైన నేపథ్యంలో రజనీ అరెస్టు ఖాయమేనని చెప్పాలి.

Satya

Recent Posts

సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గరా లలిత్ మోడీ?

బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లు ఉండి ఆర్థిక…

3 minutes ago

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

3 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

4 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

5 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

7 hours ago

ఆలూ లేదు చూలూ లేదు… చిరు, నానికి లింకు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…

9 hours ago