ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీని ఈ నెలలోనే జరిపి తీరతామని కూటమి సర్కారు మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నాటి శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ విస్పష్ట ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల (మార్చి)లోనే డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా కొత్త ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు.
మంగళవారం నాటి శాసనమండలి సమావేశాల్లో భాగంగా నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగావకాశాలపై చర్చ జరపాలంటూ వైసీపీ వాయిదా తీర్మానాలిచ్చింది. ఈ వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు, తదనంతరం సభ కార్యక్రమాల్లో బాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు… డీఎస్సీ ఎప్పుడూ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రశ్నలకు లోకేశ్ ఘాటుగా స్పందించారు. డీఎస్సీ నిర్వహణపై ఇప్పటికే చాలా సార్లు ఇదే సభలో ప్రకటన చేశామని గుర్తు చేసిన లోకేశ్… ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.
ఇక వైసీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా విడుదల కాని విషయాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు. ఏటా జాబ్ కేలండర్ అన్న వైసీపీ నేతలు… ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని చెబుతున్నా యాగీ చేయడం సరికాదన్నారు. అయినా ఉపాధ్యాయ నియామకాల్లో టీడీపీకి ఉన్న ఘన చరిత ఏ ఒక్క పార్టీకి లేదని కూడా ఆయన తెలిపారు. 1994 నుంచి ఉమ్మడి తెలుగు నేలలో 2,60184 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాగా… అందులో టీడీపీ హయాంలోనే 1,80,272 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. అంటే… ఇప్పటిదాకా భర్తీ అయిన టీచర్ పోస్టుల్లో 70 శాతం తాము ఇచ్చినవేనని లోకేశ్ గుర్తు చేశారు.
This post was last modified on March 4, 2025 12:58 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…