ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీని ఈ నెలలోనే జరిపి తీరతామని కూటమి సర్కారు మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నాటి శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ విస్పష్ట ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల (మార్చి)లోనే డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా కొత్త ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు.
మంగళవారం నాటి శాసనమండలి సమావేశాల్లో భాగంగా నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగావకాశాలపై చర్చ జరపాలంటూ వైసీపీ వాయిదా తీర్మానాలిచ్చింది. ఈ వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు, తదనంతరం సభ కార్యక్రమాల్లో బాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు… డీఎస్సీ ఎప్పుడూ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రశ్నలకు లోకేశ్ ఘాటుగా స్పందించారు. డీఎస్సీ నిర్వహణపై ఇప్పటికే చాలా సార్లు ఇదే సభలో ప్రకటన చేశామని గుర్తు చేసిన లోకేశ్… ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.
ఇక వైసీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా విడుదల కాని విషయాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు. ఏటా జాబ్ కేలండర్ అన్న వైసీపీ నేతలు… ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని చెబుతున్నా యాగీ చేయడం సరికాదన్నారు. అయినా ఉపాధ్యాయ నియామకాల్లో టీడీపీకి ఉన్న ఘన చరిత ఏ ఒక్క పార్టీకి లేదని కూడా ఆయన తెలిపారు. 1994 నుంచి ఉమ్మడి తెలుగు నేలలో 2,60184 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాగా… అందులో టీడీపీ హయాంలోనే 1,80,272 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. అంటే… ఇప్పటిదాకా భర్తీ అయిన టీచర్ పోస్టుల్లో 70 శాతం తాము ఇచ్చినవేనని లోకేశ్ గుర్తు చేశారు.
This post was last modified on March 4, 2025 12:58 pm
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…