ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీని ఈ నెలలోనే జరిపి తీరతామని కూటమి సర్కారు మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నాటి శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ విస్పష్ట ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల (మార్చి)లోనే డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా కొత్త ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు.
మంగళవారం నాటి శాసనమండలి సమావేశాల్లో భాగంగా నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగావకాశాలపై చర్చ జరపాలంటూ వైసీపీ వాయిదా తీర్మానాలిచ్చింది. ఈ వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు, తదనంతరం సభ కార్యక్రమాల్లో బాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు… డీఎస్సీ ఎప్పుడూ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రశ్నలకు లోకేశ్ ఘాటుగా స్పందించారు. డీఎస్సీ నిర్వహణపై ఇప్పటికే చాలా సార్లు ఇదే సభలో ప్రకటన చేశామని గుర్తు చేసిన లోకేశ్… ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.
ఇక వైసీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా విడుదల కాని విషయాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు. ఏటా జాబ్ కేలండర్ అన్న వైసీపీ నేతలు… ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని చెబుతున్నా యాగీ చేయడం సరికాదన్నారు. అయినా ఉపాధ్యాయ నియామకాల్లో టీడీపీకి ఉన్న ఘన చరిత ఏ ఒక్క పార్టీకి లేదని కూడా ఆయన తెలిపారు. 1994 నుంచి ఉమ్మడి తెలుగు నేలలో 2,60184 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాగా… అందులో టీడీపీ హయాంలోనే 1,80,272 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. అంటే… ఇప్పటిదాకా భర్తీ అయిన టీచర్ పోస్టుల్లో 70 శాతం తాము ఇచ్చినవేనని లోకేశ్ గుర్తు చేశారు.
This post was last modified on March 4, 2025 12:58 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…