బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే సినిమా మల్లీశ్వరి. వెంకటేష్ హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు మాములుగా పేలలేదు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించి పెట్టాయి. తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగు చేసింది కానీ ఆశించిన ఫలితం రాలేదు.
తెలుగులో అవకాశాలు వచ్చినా బాలీవుడ్ లోనే తెగ బిజీ అయిపోవడంతో మళ్ళీ ఇటు పక్క తిరిగి చూడలేదు. ఇదంతా 2005 అంటే ఇరవై సంవత్సరాల క్రితం ముచ్చట. తర్వాత కత్రినా హిందీలో బోలెడు విజయాలు సాధించడం, విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఇప్పుడీ మల్లీశ్వరి భర్త సాధిస్తున్న బ్లాక్ బస్టర్లు చూసి తెగ మురిసిపోతోంది. తాజాగా విడుదలైన చావా భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్ప 2ని సవాల్ చేసే రేంజ్ లో చావా నెంబర్లు నమోదవుతున్నాయి. మొదటి వీకెండ్ కే సులభంగా వంద కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
శంభాజీ మహారాజ్ పాత్ర కోసం 100 కేజీలకు పైగా బరువు ఉండేలా చూసుకుని శారీకరంగా శ్రమ పడిన విక్కీ కౌశల్ దానికి తగ్గట్టే తెరమీద టెర్రఫిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. వేరే ఏ ఆర్టిస్టు ఊహించలేనంత గొప్పగా జాతీయ అవార్డు రావొచ్చనే స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
విక్కీ కౌశల్ పడిన కష్టం దీనికొకటే కాదు. గతంలో శామ్ బహదూర్ క్యారెక్టర్ కోసం రెండు సంవత్సరాలు కఠోర పరిశోధన చేసి తనను తాను సంసిద్ధం చేసుకున్నాడు. ఉరి సర్జికల్ స్ట్రైక్ కోసం దర్శకుడు బరువు విషయంలో సూచనలు చేస్తే తక్కువ టైంలో పధ్నాలుగు కేజీలు తగ్గించుకుని శబాష్ అనిపించుకున్నాడు.
మధ్యలో కొన్ని రెగ్యులర్ ఎంటర్ టైనర్లు చేశాడు కానీ చావా పుణ్యమాని స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టడం ఖాయం. ఇప్పుడున్న జోరు కనక కొనసాగితే ఫైనల్ రన్ అయ్యేలోపు స్త్రీ 2 కలెక్షన్లను దాటేస్తుందని ట్రేడ్ అంచనా. నాలుగేళ్ల క్రితం మన మల్లీశ్వరితో పెళ్ళైన వేళా విశేషమో ఏమో కానీ విక్కీ దూసుకుపోతున్నాడు.
This post was last modified on February 16, 2025 4:35 pm
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…