షైన్ స్క్రీన్స్.. టాలీవుడ్లో ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఉన్న బేనర్లలో ఒకటి. హరీష్ పెద్దితో కలిసి సాహు గారపాటి ఈ సంస్థను మొదలుపెట్టాడు. ప్రస్తుతం సాహు ఒక్కడే దీన్ని నడిపిస్తున్నాడు. ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంతో షైన్ స్క్రీన్స్ ప్రయాణం మొదలైంది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా.. రెండో చిత్రం ‘మజిలీ’ పెద్ద హిట్టయి ఈ సంస్థను నిలబెట్టింది.
ఆ తర్వాత గాలి సంపత్, ఉగ్రం కొంత నిరాశపరిచాయి. ఓటీటీలో నేరుగా రిలీజైన ‘టక్ జగదీష్’ మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. నిర్మాతలకు లాభాలే అందించింది. ఇక నందమూరి బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’ షైన్ స్క్రీన్ సంస్థలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సంస్త స్థాయిని పెంచింది. ఈ చిత్రాన్ని రూపొందించిన అనిల్ రావిపూడితోనే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా నిర్మించబోతోంది షైన్ స్క్రీన్స్ సంస్థ.
ఐతే ఈ ప్రాజెక్టు గురించి ఎగ్జైట్ అవుతున్న దశలో సాహు గారపాటికి పెద్ద షాక్ తగిలింది ‘లైలా2 సినిమా రూపంలో. షైన్ స్క్రీన్స్ సంస్థలో ఇప్పటిదాకా వచ్చిన చిత్రాల్లో కొన్ని ఫ్లాపులు ఉండొచ్చు. కానీ వాటిని దారుణమైన సినిమాలని చెప్పలేం. గాలి సంపత్, ఉగ్రం లాంటి చిత్రాలు మంచి కంటెంట్తో తెరకెక్కాయి. ‘కృష్ణార్జున యుద్ధం’ను బ్యాడ్ మూవీగా చెప్పలేం. ఫ్లాప్ సినిమాలతోనూ గౌరవమే సంపాదించుకుందీ సంస్థ.
అలాంటి బేనర్ మీద ‘లైలా’ రూపంలో పెద్ద మరక పడింది. ఈ సినిమా డిజాస్టర్ కావడం ఒకెత్తయితే.. చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా విమర్శిస్తుండడం మరో ఎత్తు. యూత్ సినిమా పేరుతో దారుణమైన బూతు సీన్లు, డైలాగులతో సినిమాను తీర్చిదిద్దిన తీరును అందరూ తప్పుబడుతున్నారు. సినిమా ఎలా తీయకూడదో చెప్పడానికి దీన్ని ఉదాహరణగా దీన్ని చూపిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఇంత ఏకగ్రీవంగా అందరూ వ్యతిరేకించిన సినిమా ఇదే. ఇందులోని సీన్లు, డైలాగుల గురించి మాట్లాడ్డానికి కూడా జనం ఇబ్బంది పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సినిమా తీసి డబ్బులు పోగొట్టుకోవడానికి తోడు.. ఇలా అవమాన భారాన్ని ఎదుర్కోవాల్సి రావడం నిర్మాతకు ఎంత ఇబ్బందో చెప్పేదేముంది?
This post was last modified on February 16, 2025 8:59 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…