Political News

తిరుపతి వేదికగా ఒకే స్టేజీపై ముగ్గురు సీఎంలు?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి వేదికగా రేపు ఓ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికను ముగ్గురు సీఎంలు పంచుకోనున్నారు. ఇందుకు తిరుపతి వేదికగా రేపు ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ వేదికకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ లు హాజరు కానున్నారు. వీరిలో చంద్రబాబు టీడీపీ అధినేతగా ఉండగా.. మిగిలిన ఇద్దరు సీఎంలు బీజేపీ నేతలుగా ఉన్నారు.

అంతర్జాతీయ స్థాయి సమావేశం కావడంతో ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అధికారిక కార్యక్రమంగా జరుగుతున్న ఈ ఎక్స్ పోకు ఏపీ తరఫున సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అదే సమయంలో ఏపీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ఫడ్నవీస్, సావంత్ లు కూడా విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా ఆలయాల విశిష్టతలను తెలుపుతూ బారీ ప్రదర్శనలు ఉండనున్నట్లు సమాచారం. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 15 వేల ఆలయాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఆలయాల నిర్వహణ, అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఆలయాల నిర్వహణలో సమర్థవంతంగా వినియోగించుకునే విషయాలపై ఈ సదస్సులో కీలక చర్చ జరగనుంది.

అంతేకాకుండా ఆయా ఆలయాల పవిత్రతను కాపాడే దిశగా చేపట్టాల్సిన చర్యలపైనా ఈ సదస్సులో చర్చ జరగనున్నట్లు సమాచారం. ఆయా ఆలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, వాటి మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపైనా విస్తృత స్థాయిలో చర్చ జరగనున్నట్లు సమాచారం.

This post was last modified on February 16, 2025 10:09 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Tirumala

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago