గడ దశాబ్ద కాలంలో ఓటీటీలు, ఇతర కారణాల పుణ్యమా అని.. సినిమాల్లో బోల్డ్ కంటెంట్ డోస్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక లిప్ లాకో.. ఒక ఇంటిమేట్ సీనో ఉంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అవి సర్వసాధారణం అయిపోయాయి. ఇక డైలాగుల్లో డబుల్ మీనింగ్లకు హద్దులే లేవు. డైరెక్ట్ బూతులే పెట్టేస్తున్నారు.
‘జబర్దస్త్’ కూడా కొంతమేర ద్వంద్వార్థాలు పెరగడానికి కారణమైంది. వీటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. ప్రేక్షకుల తీరు మారిందని, యూత్కు ఇవే నచ్చుతాయని అంటున్నారు. కొన్ని సినిమాల ఫలితాలు చూస్తే.. హిట్ కొట్టడానికి బోల్డ్ కంటెంటే కారణమనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో సన్నివేశాలు, డైలాగులు శ్రుతి మించిపోతున్నాయి. యూత్ఫుల్ ఎంటర్టైనర్ పేరుతో బూతునే నింపి సినిమాలను వదిలేస్తున్నారు.
కానీ అలాంటి సినిమాలను ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ.. లైలా. ‘లైలా’ ట్రైలర్ చూసినపుడే చాలామంది నోరెళ్లబెట్టారు. కొన్ని సన్నివేశాలు.. వాటికి తోడు ‘‘నాది లోపల ఉన్న మేటర్ చూస్తే నీది గుండె ఆగి చస్తాయ్’’.. ‘‘కాయ లేదు పండు ఉన్నాయ్.. పువ్వు లేదు కాయ ఉన్నాయ్.. చమిడి లేదు లమిడి ఉన్నాయ్’’.. ‘‘అన్నీ హోల్స్ మూసుకుపోయేలా ఫెవికాల్ తాగి చచ్చిపోతా’’ లాంటి డైలాగులు చూసి వామ్మో వాయ్యో అనుకున్నారు.
ఐతే సినిమా చూశాక.. ట్రైలర్లో చూపించినవి చాలా సింపుల్ అని చెప్పాల్సిందే. రాయడానికి వీల్లేని స్థాయిలో దారుణమైన బూతులతో సినిమాను నింపేశారు. జ్యోతిష్యుడికి చెయ్యి చూపిస్తే రేఖలు అరిగిపోయాయన్నాడు అనడం.. ‘‘ఆకులు ఎందుకు? కొత్తగా మొలిచిన నా.. ’’ లాంటి డైలాగులైతే ఘోరాతి ఘోరం. ఇక ‘పండు’ చుట్టూ ఇందులో నడిపిన కామెడీ గురించి అయితే మాట్లాడుకోవడం కూడా కష్టం.
వీటిని జస్ట్ బోల్డ్ అని సరిపెట్టుకోలేం. చాలా వల్గర్గా అనిపించే డైలాగులు.. సీన్లతో ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. యూత్ సైతం ఇలాంటి కంటెంట్ను ఇష్టపడతారా అన్నది సందేహమే. అందుకే ‘లైలా’కు అంతటి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా హీరో విశ్వక్సేన్కు పెద్ద గుణపాఠంగా మారుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on February 15, 2025 2:17 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…