గడ దశాబ్ద కాలంలో ఓటీటీలు, ఇతర కారణాల పుణ్యమా అని.. సినిమాల్లో బోల్డ్ కంటెంట్ డోస్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక లిప్ లాకో.. ఒక ఇంటిమేట్ సీనో ఉంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అవి సర్వసాధారణం అయిపోయాయి. ఇక డైలాగుల్లో డబుల్ మీనింగ్లకు హద్దులే లేవు. డైరెక్ట్ బూతులే పెట్టేస్తున్నారు.
‘జబర్దస్త్’ కూడా కొంతమేర ద్వంద్వార్థాలు పెరగడానికి కారణమైంది. వీటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. ప్రేక్షకుల తీరు మారిందని, యూత్కు ఇవే నచ్చుతాయని అంటున్నారు. కొన్ని సినిమాల ఫలితాలు చూస్తే.. హిట్ కొట్టడానికి బోల్డ్ కంటెంటే కారణమనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో సన్నివేశాలు, డైలాగులు శ్రుతి మించిపోతున్నాయి. యూత్ఫుల్ ఎంటర్టైనర్ పేరుతో బూతునే నింపి సినిమాలను వదిలేస్తున్నారు.
కానీ అలాంటి సినిమాలను ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ.. లైలా. ‘లైలా’ ట్రైలర్ చూసినపుడే చాలామంది నోరెళ్లబెట్టారు. కొన్ని సన్నివేశాలు.. వాటికి తోడు ‘‘నాది లోపల ఉన్న మేటర్ చూస్తే నీది గుండె ఆగి చస్తాయ్’’.. ‘‘కాయ లేదు పండు ఉన్నాయ్.. పువ్వు లేదు కాయ ఉన్నాయ్.. చమిడి లేదు లమిడి ఉన్నాయ్’’.. ‘‘అన్నీ హోల్స్ మూసుకుపోయేలా ఫెవికాల్ తాగి చచ్చిపోతా’’ లాంటి డైలాగులు చూసి వామ్మో వాయ్యో అనుకున్నారు.
ఐతే సినిమా చూశాక.. ట్రైలర్లో చూపించినవి చాలా సింపుల్ అని చెప్పాల్సిందే. రాయడానికి వీల్లేని స్థాయిలో దారుణమైన బూతులతో సినిమాను నింపేశారు. జ్యోతిష్యుడికి చెయ్యి చూపిస్తే రేఖలు అరిగిపోయాయన్నాడు అనడం.. ‘‘ఆకులు ఎందుకు? కొత్తగా మొలిచిన నా.. ’’ లాంటి డైలాగులైతే ఘోరాతి ఘోరం. ఇక ‘పండు’ చుట్టూ ఇందులో నడిపిన కామెడీ గురించి అయితే మాట్లాడుకోవడం కూడా కష్టం.
వీటిని జస్ట్ బోల్డ్ అని సరిపెట్టుకోలేం. చాలా వల్గర్గా అనిపించే డైలాగులు.. సీన్లతో ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. యూత్ సైతం ఇలాంటి కంటెంట్ను ఇష్టపడతారా అన్నది సందేహమే. అందుకే ‘లైలా’కు అంతటి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా హీరో విశ్వక్సేన్కు పెద్ద గుణపాఠంగా మారుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on February 15, 2025 2:17 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…