ఇప్పటితరంలో ఎంతటి అందాల రాశి అయినా రెండు దశాబ్దాల పాటు హీరోయిన్గా అవకాశాలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది గత 18 ఏళ్లుగా ఎలాంటి బ్రేక్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది త్రిష.
తెలుగులో ప్రభాస్ సరసన ‘వర్షం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో యూత్కు హాట్ ఫెవరెట్ హీరోయిన్గా మారిపోయింది. అటు సొంత ఇండస్ట్రీ కోలీవుడ్లోనూ ఇప్పటికీ టాప్ స్టార్గా కొనసాగుతోంది. అలాంటి హీరోయిన్ తనను పడేయాలంటే… ఇలా ట్రై చేయడంటూ ఓ అదిరే ఆఫర్ ఇస్తోంది.
‘నేను చాలారోజులుగా ఎవ్వరితోనే డేటింగ్ చేయడం లేదు… మీకు నాపైన ఇంట్రెస్ట్ ఉంటే… ఓ 500 పదాలతో వ్యాసం రాయండి. మీరు నా సమయాన్ని వృథా చేయకుండా ఎలా చూసుకుంటున్నారో ఈ వ్యాసంలో వివరించి, ఇంప్రెస్ చేయండి’ అంటూ ఇన్స్టా ద్వారా తన ఫ్యాన్స్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది త్రిష.
500 పదాల్లో త్రిషపై ఉన్న ప్రేమను, ఆరాధనను అద్భుతంగా వివరించే భావ కవితో త్రిష డేట్ చేస్తుందన్నమాట. త్రిషకు కొన్నాళ్ల కిందట చెన్నైకి చెందిన ఓ బడా బిజినెస్మ్యాన్తో ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకుని, త్రిష
అంతకుముందు ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో కూడా డేటింగ్ చేసిన త్రిష… ఇప్పుడు ఇలా ఫ్యాన్స్కు ఆఫర్ ఇవ్వడం చూస్తుంటే, లాక్డౌన్లో బోర్ కొట్టి… ఇలా ప్లాన్ వేసిందేమో! అని అనుమానిస్తున్నారు కొందరు నెటిజన్లు. 36 ఏళ్ల త్రిష, త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని, అందుకే మంచి వ్యక్తి కోసం వెతుకుతోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్లో ఐదు, మలయాళంలో ఓ సినిమా చేస్తున్న త్రిష… ‘నాయకి’ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు.
This post was last modified on April 29, 2020 3:45 pm
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…