ఇప్పటితరంలో ఎంతటి అందాల రాశి అయినా రెండు దశాబ్దాల పాటు హీరోయిన్గా అవకాశాలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది గత 18 ఏళ్లుగా ఎలాంటి బ్రేక్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది త్రిష.
తెలుగులో ప్రభాస్ సరసన ‘వర్షం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో యూత్కు హాట్ ఫెవరెట్ హీరోయిన్గా మారిపోయింది. అటు సొంత ఇండస్ట్రీ కోలీవుడ్లోనూ ఇప్పటికీ టాప్ స్టార్గా కొనసాగుతోంది. అలాంటి హీరోయిన్ తనను పడేయాలంటే… ఇలా ట్రై చేయడంటూ ఓ అదిరే ఆఫర్ ఇస్తోంది.
‘నేను చాలారోజులుగా ఎవ్వరితోనే డేటింగ్ చేయడం లేదు… మీకు నాపైన ఇంట్రెస్ట్ ఉంటే… ఓ 500 పదాలతో వ్యాసం రాయండి. మీరు నా సమయాన్ని వృథా చేయకుండా ఎలా చూసుకుంటున్నారో ఈ వ్యాసంలో వివరించి, ఇంప్రెస్ చేయండి’ అంటూ ఇన్స్టా ద్వారా తన ఫ్యాన్స్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది త్రిష.
500 పదాల్లో త్రిషపై ఉన్న ప్రేమను, ఆరాధనను అద్భుతంగా వివరించే భావ కవితో త్రిష డేట్ చేస్తుందన్నమాట. త్రిషకు కొన్నాళ్ల కిందట చెన్నైకి చెందిన ఓ బడా బిజినెస్మ్యాన్తో ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకుని, త్రిష
అంతకుముందు ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో కూడా డేటింగ్ చేసిన త్రిష… ఇప్పుడు ఇలా ఫ్యాన్స్కు ఆఫర్ ఇవ్వడం చూస్తుంటే, లాక్డౌన్లో బోర్ కొట్టి… ఇలా ప్లాన్ వేసిందేమో! అని అనుమానిస్తున్నారు కొందరు నెటిజన్లు. 36 ఏళ్ల త్రిష, త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని, అందుకే మంచి వ్యక్తి కోసం వెతుకుతోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్లో ఐదు, మలయాళంలో ఓ సినిమా చేస్తున్న త్రిష… ‘నాయకి’ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు.
This post was last modified on April 29, 2020 3:45 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…