ఇప్పటితరంలో ఎంతటి అందాల రాశి అయినా రెండు దశాబ్దాల పాటు హీరోయిన్గా అవకాశాలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది గత 18 ఏళ్లుగా ఎలాంటి బ్రేక్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది త్రిష.
తెలుగులో ప్రభాస్ సరసన ‘వర్షం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో యూత్కు హాట్ ఫెవరెట్ హీరోయిన్గా మారిపోయింది. అటు సొంత ఇండస్ట్రీ కోలీవుడ్లోనూ ఇప్పటికీ టాప్ స్టార్గా కొనసాగుతోంది. అలాంటి హీరోయిన్ తనను పడేయాలంటే… ఇలా ట్రై చేయడంటూ ఓ అదిరే ఆఫర్ ఇస్తోంది.
‘నేను చాలారోజులుగా ఎవ్వరితోనే డేటింగ్ చేయడం లేదు… మీకు నాపైన ఇంట్రెస్ట్ ఉంటే… ఓ 500 పదాలతో వ్యాసం రాయండి. మీరు నా సమయాన్ని వృథా చేయకుండా ఎలా చూసుకుంటున్నారో ఈ వ్యాసంలో వివరించి, ఇంప్రెస్ చేయండి’ అంటూ ఇన్స్టా ద్వారా తన ఫ్యాన్స్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది త్రిష.
500 పదాల్లో త్రిషపై ఉన్న ప్రేమను, ఆరాధనను అద్భుతంగా వివరించే భావ కవితో త్రిష డేట్ చేస్తుందన్నమాట. త్రిషకు కొన్నాళ్ల కిందట చెన్నైకి చెందిన ఓ బడా బిజినెస్మ్యాన్తో ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకుని, త్రిష
అంతకుముందు ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో కూడా డేటింగ్ చేసిన త్రిష… ఇప్పుడు ఇలా ఫ్యాన్స్కు ఆఫర్ ఇవ్వడం చూస్తుంటే, లాక్డౌన్లో బోర్ కొట్టి… ఇలా ప్లాన్ వేసిందేమో! అని అనుమానిస్తున్నారు కొందరు నెటిజన్లు. 36 ఏళ్ల త్రిష, త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని, అందుకే మంచి వ్యక్తి కోసం వెతుకుతోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్లో ఐదు, మలయాళంలో ఓ సినిమా చేస్తున్న త్రిష… ‘నాయకి’ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…