సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి సినిమా విషయంలో సస్పెన్సుకు తెరపడ్డట్లే. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో చేయాల్సిన సినిమాను క్యాన్సిల్ చేసుకున్న మహేష్.. పరశురామ్ సినిమాను ఓకే చేసినట్లే చేసి.. తర్వాత ఆ చిత్రంపై సందేహాలు కలిగేలా చేసిన సంగతి తెలిసిందే.
ఈ కాంబినేషన్లో సినిమా గురించి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. మహేష్ కానీ.. పరశురామ్ కానీ ఈ సినిమా గురించి మాట్లాడలేదు. మరోవైపు కథలో మార్పులు జరుగుతున్నట్లు.. సినిమా ఇంకా ఖరారు కానట్లు గుసగుసలు వినిపించాయి. ఐతే ఇప్పుడు స్వయంగా పరశురామే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించాడు.
మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా తాను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచిందని.. మహేష్తో సినిమా చేయాలని తాను ఎప్పట్నుంచో అనుకుంటున్నానని.. చివరికి తన కల నెరవేరబోతోందని పరశురామ్ అన్నాడు. అద్భుతమైన సబ్జెక్టుతో మహేష్ సినిమా తెరకెక్కబోతోందని.. సూపర్ స్టార్ కెరీర్లో ఇదో మైలురాయిలా నిలుస్తుందని పరశురామ్ ధీమా వ్యక్తం చేశాడు.
తాను ఎలివేషన్ సీన్లు రాయలేక ఏమీ కాదని.. తన గత సినిమాల్లో అందుకు పెద్దగా అవకాశం రాలేదని.. మహేష్ సినిమాలో అలాంటి సీన్లకు ఢోకా ఉండదని.. పరశురామ్ చెప్పడం సూపర్ స్టార్ అభిమానుల్ని ఎగ్జైట్ చేసేదే. పరశురామ్ ఇచ్చిన ఎలివేషన్తో మహేష్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంటారనడంలో సందేహం లేదు. 14 రీల్స్ ప్లస్ బేనర్ మీద రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం.
This post was last modified on April 30, 2020 12:28 am
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…