సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి సినిమా విషయంలో సస్పెన్సుకు తెరపడ్డట్లే. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో చేయాల్సిన సినిమాను క్యాన్సిల్ చేసుకున్న మహేష్.. పరశురామ్ సినిమాను ఓకే చేసినట్లే చేసి.. తర్వాత ఆ చిత్రంపై సందేహాలు కలిగేలా చేసిన సంగతి తెలిసిందే.
ఈ కాంబినేషన్లో సినిమా గురించి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. మహేష్ కానీ.. పరశురామ్ కానీ ఈ సినిమా గురించి మాట్లాడలేదు. మరోవైపు కథలో మార్పులు జరుగుతున్నట్లు.. సినిమా ఇంకా ఖరారు కానట్లు గుసగుసలు వినిపించాయి. ఐతే ఇప్పుడు స్వయంగా పరశురామే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించాడు.
మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా తాను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచిందని.. మహేష్తో సినిమా చేయాలని తాను ఎప్పట్నుంచో అనుకుంటున్నానని.. చివరికి తన కల నెరవేరబోతోందని పరశురామ్ అన్నాడు. అద్భుతమైన సబ్జెక్టుతో మహేష్ సినిమా తెరకెక్కబోతోందని.. సూపర్ స్టార్ కెరీర్లో ఇదో మైలురాయిలా నిలుస్తుందని పరశురామ్ ధీమా వ్యక్తం చేశాడు.
తాను ఎలివేషన్ సీన్లు రాయలేక ఏమీ కాదని.. తన గత సినిమాల్లో అందుకు పెద్దగా అవకాశం రాలేదని.. మహేష్ సినిమాలో అలాంటి సీన్లకు ఢోకా ఉండదని.. పరశురామ్ చెప్పడం సూపర్ స్టార్ అభిమానుల్ని ఎగ్జైట్ చేసేదే. పరశురామ్ ఇచ్చిన ఎలివేషన్తో మహేష్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంటారనడంలో సందేహం లేదు. 14 రీల్స్ ప్లస్ బేనర్ మీద రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం.
This post was last modified on April 30, 2020 12:28 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…