కరోనా వైరస్ కారణంగా చనిపోవడం అత్యంత దురదృష్టకరమైన మరణంగా భావిస్తున్నారు అందరూ. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా పార్థివ దేహాన్ని తాకలేని, అంత్యక్రియలు నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితులు కరోనా మృతుల విషయంలో చూస్తున్నాం. ఐతే ప్రస్తుత కరోనా కాలంలో మామూలుగా చనిపోవడం కూడా దురదృష్టమే అని చెప్పాలి. ఎందుకంటే.. లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడ ఆగిపోవడంతో సన్నిహితులు ఎవరైనా చనిపోయినా వెళ్లి కడసారి చూడలేని పరిస్థితి.
గత నెల రోజుల్లో చనిపోయిన అనేకమందిని వారి సంతానం కూడా కడసారి చూడలేని పరిస్థితి తలెత్తింది. స్వయంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇంటి పని మనిషి చనిపోతే.. ఆమె కుటుంబ సభ్యుల దగ్గరికి పార్థివ దేహాన్ని చేర్చలేక అతనే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు.
మృతులు ఎంతటి వాళ్లయినా సరే.. వారికి ఘనంగా వీడ్కోలు పలికే అవకాశం లేకపోయింది. లెజెండరీ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ విషయంలోనూ ఇదే జరిగింది. బుధవారం ఆయన అంత్య క్రియలు చాలా సాధారణంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య అంత్యక్రియలు ముగించారు. ఇర్ఫాన్కు బాలీవుడ్లో ఎంతోమంది సన్నిహితులున్నారు. ఆయనపై పరిశ్రమలో అందరికి అపారమైన గౌరవభావం ఉంది.
మామూలు రోజుల్లో అయితే ఇర్ఫాన్ అంత్యక్రియలకు వేలల్లో జనం హాజరయ్యేవాళ్లు. బాలీవుడ్ అంతా ఆయన ఇంటికి వెళ్లేది. కానీ కరోనా కారణంగా ఎవ్వరూ వెళ్లి చూడలేని పరిస్థితి. తమ మిత్రుడిని కడసారి చూసుకుని కన్నీళ్లు పెట్టుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఆయన ఆప్తుల్ని తీవ్ర వేదనకు గురి చేసేదే.
This post was last modified on April 29, 2020 9:14 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…