మోనాలిసా.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో.. వెబ్-ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మాయి ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఒక పేద బంజారా కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి.. కుంభమేళా పుణ్యమా అని నేషనల్ లెవెల్లో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించింది.
పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి సెలబ్రెటీగా మారిపోయింది. ఈ ఫేమ్తోనే మోనాలిసా ఇప్పుడు వెండి తెరపైనా కనిపించబోతోంది. తనకు సినిమా ఛాన్స్ లభించడం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తాను తీయబోయే తర్వాతి సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇస్తానని ఇప్పటికే ప్రకటించాడు.
ఐతే ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయకుండా.. తన మాటను నిలబెట్టుకున్నాడు సనోజ్. మోనాలిసా తండ్రితో ఫోన్ మాట్లాడిన సనోజ్.. తాజాగా మోనాలిసాను కలిశాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలో ఉండే ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ గ్రామానికి వెళ్లిన సనోజ్.. మోనాలిసాను కలిసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన తర్వాతి ప్రాజెక్ట్ ‘ది స్టోరీ ఆఫ్ మణిపూర్’లో మోనాలిసాను ఒక పాత్రలో నటింపజేయనున్నట్లు ఆయన వెల్లడించాడు. సినిమా ఇండస్ట్రీ గురించి మోనాలిసాకు, ఆమె కుటుంబ సభ్యులకు వివరించి.. ధైర్యంగా ఇండస్ట్రీలోకి రావచ్చని సనోజ్ భరోసా ఇచ్చాడు.
కుంభమేళాలో తనకు వచ్చిన పాపులారిటీతో కొన్ని రోజులు మోనాలిసా చిక్కులు తప్పలేదు. ఫొటోలు, వీడియోల కోసం యాత్రికులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వెంట పడడంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా సినిమా ఛాన్స్ రావడంతో ఆమె జీవితం గొప్ప మలుపు తిరగబోతున్నట్లే.
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…
కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…