Movie News

నిజమే.. వెండితెరపై కుంభమేళా బ్యూటీ

మోనాలిసా.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో.. వెబ్-ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మాయి ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఒక పేద బంజారా కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి.. కుంభమేళా పుణ్యమా అని నేషనల్ లెవెల్లో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించింది.

పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి సెలబ్రెటీగా మారిపోయింది. ఈ ఫేమ్‌తోనే మోనాలిసా ఇప్పుడు వెండి తెరపైనా కనిపించబోతోంది. తనకు సినిమా ఛాన్స్ లభించడం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తాను తీయబోయే తర్వాతి సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇస్తానని ఇప్పటికే ప్రకటించాడు.

ఐతే ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయకుండా.. తన మాటను నిలబెట్టుకున్నాడు సనోజ్. మోనాలిసా తండ్రితో ఫోన్ మాట్లాడిన సనోజ్.. తాజాగా మోనాలిసాను కలిశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలో ఉండే ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ గ్రామానికి వెళ్లిన సనోజ్.. మోనాలిసాను కలిసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన తర్వాతి ప్రాజెక్ట్ ‘ది స్టోరీ ఆఫ్ మణిపూర్’లో మోనాలిసాను ఒక పాత్రలో నటింపజేయనున్నట్లు ఆయన వెల్లడించాడు. సినిమా ఇండస్ట్రీ గురించి మోనాలిసాకు, ఆమె కుటుంబ సభ్యులకు వివరించి.. ధైర్యంగా ఇండస్ట్రీలోకి రావచ్చని సనోజ్ భరోసా ఇచ్చాడు.

కుంభమేళాలో తనకు వచ్చిన పాపులారిటీతో కొన్ని రోజులు మోనాలిసా చిక్కులు తప్పలేదు. ఫొటోలు, వీడియోల కోసం యాత్రికులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆమె వెంట పడడంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా సినిమా ఛాన్స్ రావడంతో ఆమె జీవితం గొప్ప మలుపు తిరగబోతున్నట్లే.

This post was last modified on January 31, 2025 12:40 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

26 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

39 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

50 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago