మోనాలిసా.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో.. వెబ్-ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మాయి ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఒక పేద బంజారా కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి.. కుంభమేళా పుణ్యమా అని నేషనల్ లెవెల్లో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించింది.
పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి సెలబ్రెటీగా మారిపోయింది. ఈ ఫేమ్తోనే మోనాలిసా ఇప్పుడు వెండి తెరపైనా కనిపించబోతోంది. తనకు సినిమా ఛాన్స్ లభించడం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తాను తీయబోయే తర్వాతి సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇస్తానని ఇప్పటికే ప్రకటించాడు.
ఐతే ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయకుండా.. తన మాటను నిలబెట్టుకున్నాడు సనోజ్. మోనాలిసా తండ్రితో ఫోన్ మాట్లాడిన సనోజ్.. తాజాగా మోనాలిసాను కలిశాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలో ఉండే ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ గ్రామానికి వెళ్లిన సనోజ్.. మోనాలిసాను కలిసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన తర్వాతి ప్రాజెక్ట్ ‘ది స్టోరీ ఆఫ్ మణిపూర్’లో మోనాలిసాను ఒక పాత్రలో నటింపజేయనున్నట్లు ఆయన వెల్లడించాడు. సినిమా ఇండస్ట్రీ గురించి మోనాలిసాకు, ఆమె కుటుంబ సభ్యులకు వివరించి.. ధైర్యంగా ఇండస్ట్రీలోకి రావచ్చని సనోజ్ భరోసా ఇచ్చాడు.
కుంభమేళాలో తనకు వచ్చిన పాపులారిటీతో కొన్ని రోజులు మోనాలిసా చిక్కులు తప్పలేదు. ఫొటోలు, వీడియోల కోసం యాత్రికులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వెంట పడడంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా సినిమా ఛాన్స్ రావడంతో ఆమె జీవితం గొప్ప మలుపు తిరగబోతున్నట్లే.
This post was last modified on January 31, 2025 12:40 pm
జనసేన పార్టీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంది? అనేది తరచుగా తెర మీదకు…
బిహార్ రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తోన్న నితిష్ కుమార్ శకం దాదాపు ముగిసిపోయింది. ఇప్పుడు బిహార్ రాజకీయ చరిత్రలో…
ఏపీ ఉద్యోగుల్లో ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు ఐదేళ్ల పాటు తమకు తీరని అన్యాయం…
ఈ ఇండస్ట్రీకి ఏమైంది అన్నట్టు ఉంది ఇండస్ట్రీ పరిస్థితి. వరుస డిజాస్టర్లు... ఖాళీగా బోసిపోతున్న థియేటర్లు. సంక్రాంతి తరువాత ఒక్క…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన `మావిగన్` అంటే.... మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన రాజధానిపై ప్రజల్లో ఏ మేరకు…
ఒక భాష నుంచి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వస్తే.. ఆ భాషకు సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీ గర్వంతో తలెత్తుకుంటుంది. ‘బాహుబలి’…