వారం వారం కొత్త సినిమా రిలీజ్ కాగానే థియేటర్లలో వాలిపోయే ప్రేక్షకులు ఇండియాలో కోట్లల్లో ఉన్నారు. నెలకో సినిమా అయినా థియేటర్లో చూసే అలవాటున్న వాళ్ల సంఖ్యా తక్కువేమీ కాదు. థియేటర్లో సినిమా చూడటాన్ని ఒక పండుగలా భావించే వాళ్లందరికీ జీవితంలో ఎప్పుడూ ఎదురు కాని అనుభవాన్ని చూపించింది కరోనా. ఏడు నెలల పాటు థియేటర్లు మూతపడి ఉండటంతో ఇలాంటి ప్రేక్షకులు ఎంతగా ఇబ్బంది పడుతుంటారో చెప్పాల్సిన పని లేదు. మళ్లీ థియేటర్కు వెళ్లి మంచి సినిమా చూడాలన్న ఆరాటం వాళ్లందరిలోనూ ఉంది. ఐతే థియేటర్లయితే మళ్లీ తెరుచుకోవడానికి అనుమతులిచ్చారు కానీ.. అనేక షరతులు పెట్టడం, సరైన సినిమాలేవీ రిలీజయ్యే అవకాశాలు లేకపోవడంతో చాలా వరకు థియేటర్లు మూతపడే ఉన్నాయి.
దసరా సీజన్లో అయితే థియేటర్లు నామమాత్రంగా నడవబోతున్నాయన్నది స్పష్టం. ఐతే వచ్చే నెలలో దీపావళి సమయానికి పరిస్థితి మారుతుందని.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తాయని, కొత్త సినిమాలు విడుదలవుతాయని ఆశిస్తున్నారు. ఈ ఆశతోనే వివిధ భాషల్లో కొన్ని కొత్త చిత్రాలను విడుదలకు సిద్ధం చేయాలని చూస్తున్నారు.
లోకల్ సినిమాల సంగతేమో కానీ.. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన టెనెట్ మాత్రం దీపావళికి కచ్చితంగా థియేటర్లలోకి రాబోతోందని సమాచారం. నవంబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా రెవెన్యూ షేర్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన వీడిపోవడంతో విడుదలకు మార్గం సుగమమైంది.
హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆయా భాషల్లో పోస్టర్లు కూడా వదిలారు. కాబట్టి నవంబరు 13న మన థియేటర్లలో మన భాషలో టెనెట్ సినిమాను చూడొచ్చన్నమాట.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…