సకల జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ చేస్తామని చెప్పిన తెలుగు సినిమా నిర్మాతలు ఏవో అరకొర ఏర్పాట్లు మాత్రమే చేసి షూటింగులు కానిచ్చేస్తున్నారు. దీంతో కరోనా వైరస్ తెలుగు సినిమా షూటింగ్ స్పాట్స్లో హల్చల్ చేస్తోంది.
టక్ జగదీష్ చిత్ర బృందంలో పలువురు కరోనా వైరస్ బారిన పడడంతో షూటింగ్ నిలిపి వేసారు. పది రోజుల క్రితం మొదలైన ఈ చిత్రం షూటింగ్ స్పాట్లో పని చేస్తోన్న వారిలో పలువురికి కరోనా సోకింది. యూనిట్లోని ఒక ముఖ్య సభ్యుడికి కూడా కరోనా రావడంతో షూటింగ్కి బ్రేక్ ఇచ్చేసారు.
మీడియం బడ్జెట్ సినిమాల షూటింగ్ ఎలా జరుగుతుందనే దానిని బట్టి పెద్ద సినిమాలు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కరోనాని కట్టడి చేయడం అంత సులభం కాదనేది తేలడంతో నవంబరు నుంచి పెట్టుకుందామని అనుకున్న షూటింగులు కాన్సిల్ చేసేసారు.
టక్ జగదీష్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనేది తెలియదు. కరోనా సోకిన వారిని మినహాయించి మిగతా వాళ్లతో షూటింగ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. వాళ్లను తప్పించినా కానీ మరికొందరు దీని బారిన పడే అవకాశమయితే లేకపోలేదు. దీంతో చిత్ర పరిశ్రమ ఇప్పట్లో పూర్వ స్థితికి రాదనేది స్పష్టమైపోయింది.
This post was last modified on October 18, 2020 1:57 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…