వస్తువైనా సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ చాలా అవసరం. లేదంటే జనాలు పట్టించుకోకపోయే ప్రమాదముంది. ప్యాన్ ఇండియా మూవీకి ఎన్ని వందల కోట్లు పెట్టినా పబ్లిసిటీ లేకపోతే పబ్లిక్ లైట్ తీసుకుంటుంది. అందుకే రాజమౌళి అంతటి దర్శకధీరుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు.
కాకపోతే హీరో సహకారం చాలా అవసరం. ఇది లేకపోతే ఎవరేం చేయలేరు. విజయ్, అజిత్, నయనతార డబ్బింగ్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసే నిర్మాతలకు ఇదే పెద్ద సమస్య. షూటింగ్ వరకే తమ బాధ్యత అన్నట్టు వ్యవహరించి దాన్నే పాలసీ మ్యాటర్ గా చెప్పుకునేవాళ్ళు చాలానే ఉన్నారు.
కానీ వెంకటేష్ మాత్రం దీనికి భిన్నంగా కమిట్ మెంట్, ఎనర్జీ అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజై ఇప్పటికి పదమూడు రోజులు దాటేసింది. ఎంత బ్లాక్ బస్టర్ కొట్టినా సరే ఇంత టైం తర్వాత హీరోలు కొత్త ప్రాజెక్టు పనుల్లో బిజీ అయిపోయి ప్రమోషన్లకు రారు.
వచ్చినా ఏదో ఒక స్పీచ్, నాలుగు పొగడ్తలతో మమ అనిపించేసి వెళ్ళిపోతారు. కానీ వెంకీ మామ అలా కాదు. రిలీజ్ కు ముందు లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, టీవీ ఛానల్స్ ప్రోగ్రాములు, బాలయ్య రానా లాంటి వాళ్ళు నిర్వహించిన టాక్ షోలు ఒకటా రెండా ఏదీ కాదనకుండా ప్రతిదాంట్లో అలుపు లేకుండా పాల్గొన్నారు.
సక్సెస్ ప్రెస్ మీట్ పెడితే నిర్మాత, హీరోయిన్లు రాలేని పరిస్థితిలో దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు తానొక్కరే వచ్చారు. భీమవరంలో రెండు వారాల తర్వాత విజయోత్సవ వేడుక నిర్వహిస్తే వచ్చిన జనాలకు జోష్ ఇవ్వడం కోసం డాన్సులు చేసి, పాటలు పాడి ఎంత చేయాలో అంతా చేశారు.
యువతులైన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి సైతం వెంకీ ఎనర్జీ ముందు తక్కువగా కనిపించడం అతిశయోక్తి కాదు. ఆరు పదుల వయసులో కూడా వెంకటేష్ ఇంత చలాకీగా ప్రమోషన్లలో భాగం కావడం చూస్తే యూత్ నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. నటించడంతో మన పనైపోదు దాన్ని అందరికి చేరవేయడం అసలైన బాధ్యతని.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…