వస్తువైనా సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ చాలా అవసరం. లేదంటే జనాలు పట్టించుకోకపోయే ప్రమాదముంది. ప్యాన్ ఇండియా మూవీకి ఎన్ని వందల కోట్లు పెట్టినా పబ్లిసిటీ లేకపోతే పబ్లిక్ లైట్ తీసుకుంటుంది. అందుకే రాజమౌళి అంతటి దర్శకధీరుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు.
కాకపోతే హీరో సహకారం చాలా అవసరం. ఇది లేకపోతే ఎవరేం చేయలేరు. విజయ్, అజిత్, నయనతార డబ్బింగ్ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసే నిర్మాతలకు ఇదే పెద్ద సమస్య. షూటింగ్ వరకే తమ బాధ్యత అన్నట్టు వ్యవహరించి దాన్నే పాలసీ మ్యాటర్ గా చెప్పుకునేవాళ్ళు చాలానే ఉన్నారు.
కానీ వెంకటేష్ మాత్రం దీనికి భిన్నంగా కమిట్ మెంట్, ఎనర్జీ అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజై ఇప్పటికి పదమూడు రోజులు దాటేసింది. ఎంత బ్లాక్ బస్టర్ కొట్టినా సరే ఇంత టైం తర్వాత హీరోలు కొత్త ప్రాజెక్టు పనుల్లో బిజీ అయిపోయి ప్రమోషన్లకు రారు.
వచ్చినా ఏదో ఒక స్పీచ్, నాలుగు పొగడ్తలతో మమ అనిపించేసి వెళ్ళిపోతారు. కానీ వెంకీ మామ అలా కాదు. రిలీజ్ కు ముందు లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, టీవీ ఛానల్స్ ప్రోగ్రాములు, బాలయ్య రానా లాంటి వాళ్ళు నిర్వహించిన టాక్ షోలు ఒకటా రెండా ఏదీ కాదనకుండా ప్రతిదాంట్లో అలుపు లేకుండా పాల్గొన్నారు.
సక్సెస్ ప్రెస్ మీట్ పెడితే నిర్మాత, హీరోయిన్లు రాలేని పరిస్థితిలో దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు తానొక్కరే వచ్చారు. భీమవరంలో రెండు వారాల తర్వాత విజయోత్సవ వేడుక నిర్వహిస్తే వచ్చిన జనాలకు జోష్ ఇవ్వడం కోసం డాన్సులు చేసి, పాటలు పాడి ఎంత చేయాలో అంతా చేశారు.
యువతులైన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి సైతం వెంకీ ఎనర్జీ ముందు తక్కువగా కనిపించడం అతిశయోక్తి కాదు. ఆరు పదుల వయసులో కూడా వెంకటేష్ ఇంత చలాకీగా ప్రమోషన్లలో భాగం కావడం చూస్తే యూత్ నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. నటించడంతో మన పనైపోదు దాన్ని అందరికి చేరవేయడం అసలైన బాధ్యతని.
This post was last modified on January 27, 2025 12:49 pm
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…