విపరీతమైన ఆలస్యం, వాయిదాలతో ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకున్న అజిత్ విడాముయార్చి ఫిబ్రవరి 6 విడుదల కానుంది. ఇవాళ వదిలే ట్రైలర్ లో రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని చెన్నై రిపోర్ట్. అయితే ఇక్కడ నాగ చైతన్య ప్రస్తావన ఎందుకంటే తండేల్ ఒక్క రోజు తర్వాత ఫిబ్రవరి 7 రానున్న సంగతి తెలిసిందే.
చైతు కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ. పైగా మొదటిసారి ప్యాన్ ఇండియా స్కేల్ లో అన్ని బాషల ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సో తనకు సోలో రిలీజ్ కావడం చాలా కీలకం. మరి హఠాత్తుగా అజిత్ వస్తే ఎలానేది అక్కినేని అభిమానుల డౌట్.
కానీ ఇక్కడ మరీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకో చూద్దాం. విడాముయార్చి ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. హాలీవుడ్ రేంజులో తీశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం కూడా గొప్ప మేజిక్ చేయకపోవచ్చు.
కానీ తండేల్ అలా కాదు. ఫక్తు ఎమోషనల్ కం యాక్షన్ లవ్ స్టోరీ. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, సముద్రం, సాయిపల్లవి పాత్ర, చైతు మ్యానరిజంస్, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్ షిప్ యాంగిల్ ఇలా బోలెడున్నాయి. ఇవి భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సులభంగా కనెక్ట్ అయ్యేవి.
పైగా తెలుగులో విడాముయార్చికి ఏమంత క్రేజ్ ఉండదు. అజిత్ కి ఇక్కడ పెద్ద మార్కెట్ లేదు. తండేల్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కర్ణాటక, కేరళలోనూ జెండా పాతొచ్చు. ఎటొచ్చి తమిళనాడులో థియేటర్ల పరంగా కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు అంతే.
సంక్రాంతి సినిమాల హడావిడి అయ్యాక తండేల్ ప్రమోషన్లను పెంచబోతున్నారు. ఇప్పటికే రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. సంధ్య థియేటర్ ఉదంతం చల్లబడటంతో గీతా ఆర్ట్స్ టీమ్ పూర్తిగా పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టనుంది. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, మీడియా మీట్లు బోలెడు పెట్టబోతున్నారు. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నది కూడా వీటి కోసమే.
This post was last modified on January 16, 2025 11:02 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…