Political News

ఈడీ విచారణకు ముందు…కేటీఆర్ లెంగ్తీ ట్వీట్

ఫార్ములా ఈ కార్ రేసులు కేసులో గురువారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మ్బత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు. విచారణ కోసం ఇంటి నుంచి బయలుదేరడానికి ఓ గంట ముందు కేటీఆర్ ఓ లెంగ్తీ ట్వీట్ ను పోస్ట్ చేసారు. అందులో కేటీఆర్ ఈ కేసు గుంరించిన వివరాలనే ప్రస్తావించడం గమనార్హం.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలన్న తాపత్రయంతోనే ఫార్ములా రేసులకు ప్లాన్ చేసామన్న కేటీఆర్.. అందులో సింగల్ పైసా అవినీతి కూడా జరగలేదన్నారు. ఫార్ములా రేసుల సంస్థకు చెల్లించిన సొమ్ము మొత్తం బ్యాంకు ద్వారానే పంపిన విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. బ్యాంకుల ద్వారా సొమ్ములు పంపితే కూడా అవినీతి జరుగుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంత పారదర్శకంగా నిధులు పంపితే మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందని కూడా ఆయన ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకున్న రేవంత్ రెడ్డి సర్కారు కావాలనే తమను ఇరికిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా.. చట్టానికి లోబడి విరిచారణ సంస్థలకు సహకరిస్తామని ఆయన చెప్పారు. నిలకడ మీద అయినా నిజం బయటకి వస్తుందని తెలిపారు. హైదరాబాద్ బాగు కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనక్కు తగ్గేదే లేదని కేటీఆర్ చెప్పారు. ఈ ట్వీట్ చేసిన గంటకు కేటీఆర్ నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

Satya

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

48 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

3 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

7 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

7 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago