ఫార్ములా ఈ కార్ రేసులు కేసులో గురువారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మ్బత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు. విచారణ కోసం ఇంటి నుంచి బయలుదేరడానికి ఓ గంట ముందు కేటీఆర్ ఓ లెంగ్తీ ట్వీట్ ను పోస్ట్ చేసారు. అందులో కేటీఆర్ ఈ కేసు గుంరించిన వివరాలనే ప్రస్తావించడం గమనార్హం.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలన్న తాపత్రయంతోనే ఫార్ములా రేసులకు ప్లాన్ చేసామన్న కేటీఆర్.. అందులో సింగల్ పైసా అవినీతి కూడా జరగలేదన్నారు. ఫార్ములా రేసుల సంస్థకు చెల్లించిన సొమ్ము మొత్తం బ్యాంకు ద్వారానే పంపిన విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. బ్యాంకుల ద్వారా సొమ్ములు పంపితే కూడా అవినీతి జరుగుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంత పారదర్శకంగా నిధులు పంపితే మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందని కూడా ఆయన ప్రశ్నించారు.
ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకున్న రేవంత్ రెడ్డి సర్కారు కావాలనే తమను ఇరికిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా.. చట్టానికి లోబడి విరిచారణ సంస్థలకు సహకరిస్తామని ఆయన చెప్పారు. నిలకడ మీద అయినా నిజం బయటకి వస్తుందని తెలిపారు. హైదరాబాద్ బాగు కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనక్కు తగ్గేదే లేదని కేటీఆర్ చెప్పారు. ఈ ట్వీట్ చేసిన గంటకు కేటీఆర్ నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
This post was last modified on January 16, 2025 11:19 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…