Political News

ఈడీ విచారణకు ముందు…కేటీఆర్ లెంగ్తీ ట్వీట్

ఫార్ములా ఈ కార్ రేసులు కేసులో గురువారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మ్బత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు. విచారణ కోసం ఇంటి నుంచి బయలుదేరడానికి ఓ గంట ముందు కేటీఆర్ ఓ లెంగ్తీ ట్వీట్ ను పోస్ట్ చేసారు. అందులో కేటీఆర్ ఈ కేసు గుంరించిన వివరాలనే ప్రస్తావించడం గమనార్హం.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలన్న తాపత్రయంతోనే ఫార్ములా రేసులకు ప్లాన్ చేసామన్న కేటీఆర్.. అందులో సింగల్ పైసా అవినీతి కూడా జరగలేదన్నారు. ఫార్ములా రేసుల సంస్థకు చెల్లించిన సొమ్ము మొత్తం బ్యాంకు ద్వారానే పంపిన విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. బ్యాంకుల ద్వారా సొమ్ములు పంపితే కూడా అవినీతి జరుగుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంత పారదర్శకంగా నిధులు పంపితే మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందని కూడా ఆయన ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకున్న రేవంత్ రెడ్డి సర్కారు కావాలనే తమను ఇరికిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా.. చట్టానికి లోబడి విరిచారణ సంస్థలకు సహకరిస్తామని ఆయన చెప్పారు. నిలకడ మీద అయినా నిజం బయటకి వస్తుందని తెలిపారు. హైదరాబాద్ బాగు కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనక్కు తగ్గేదే లేదని కేటీఆర్ చెప్పారు. ఈ ట్వీట్ చేసిన గంటకు కేటీఆర్ నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

6 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

8 hours ago