సినిమాల షూటింగ్ సందర్భంగా స్టార్ హీరోలకు అన్నీ కంఫర్టబుల్గా ఉండేలా చూసకుంటారు నిర్మాతలు. వాళ్ల వీలును బట్టే షూటింగ్స్ ఉంటాయి. మిగతా ఆర్టిస్టుల డేట్లను కూడా అందుకు తగ్గట్లే సర్దుబాటు చేస్తారు. స్టార్లు సాధారణంగా ఒక సమయంలో ఒకే సినిమా చేస్తుంటారు కాబట్టి వాళ్లకు పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. కానీ హీరోయిన్లు, మిగతా ఆర్టిస్టుల పరిస్థఇతి ఇలా ఉండదు.
వాళ్లు ఒకే సమయంలో వేర్వేరు చిత్రాల్లో నటిస్తుంటారు. ఆయా సినిమాలకు తగ్గట్లు డేట్లు సర్దుబాట్లు చేసుకోవాలి. కొన్నిసార్లు ఒకే రోజు రెండు మూడు సినిమాల షూటింగ్ల్లోనూ పాల్గొనాలి. రెండు మూడు షిఫ్టుల్లోనూ పని చేయాలి. ఐతే ఒకే సిటీలో షూట్ అంటే ఓకే కానీ.. వేర్వేరు చోట్ల చిత్రీకరణ అంటే ఇబ్బంది తప్పదు.
తెలుగులో బిజీ హీరోయిన్గా ఉన్న బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ ఇప్పుడు ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటోంది. ఒకేసారి పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ మూవీ ‘రాజాసాబ్’ లో నటిస్తోందామె. ఈ రెండు చిత్రాల షూటింగ్ కోసం తాను ఎంత కష్టపడుతోందో ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘‘పవన్ కళ్యాణ్, ప్రభాస్ల సినిమాల్లో ఒకేసారి నటించడం నా అదృష్టం. అందుకోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధం. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూట్ విజయవాడలో చేస్తున్నారు. నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ సినిమా షూట్లో పాల్గొంటున్నా. మధ్యాహ్నం 2-3 మధ్య ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వస్తున్నా. అక్కడ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10-11 వరకు ‘రాజాసాబ్’ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు నేను మళ్లీ కార్లో విజయవాడకు బయల్దేరుతున్నా. నా నిద్ర కార్లోనే పూర్తి చేస్తున్నా.
తెల్లవారుజామున వీలుంటే కొంతసేపు నిద్రపోవడం.. లేదంటే నేరుగా షూట్కు వెళ్లిపోవడం. మళ్లీ ఉదయం నుంచి పవన్ గారి సినిమా షూట్లో పాల్గొంటున్నా. ఇలా తీరిక లేకుండా పని చేస్తున్నా అలసటకు గురి కావట్లేదు. ఆ రెండు సినిమాల విషయంలో నాకు అంత ఉత్సాహంగా ఉంటోంది’’ అని నిధి చెప్పింది.
This post was last modified on January 16, 2025 8:25 am
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…