థియేటరా ఓటిటినా అనేది పక్కనపెడితే భారతీయుడు 3 బయటికి రావడమైతే పక్కానే. కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే శంకర్ కు దాని వల్ల వచ్చే ఇమేజ్ తో బిజినెస్ చేయొచ్చన్న లైకా ఆలోచన పని చేసేలా కనిపించడం లేదు. తెలుగు సంగతమేమో కానీ తమిళంలో ఆశించిన రన్ దక్కించుకోలేకపోతున్న గేమ్ ఛేంజర్ కు రివ్యూలు, పబ్లిక్ టాక్ బాగానే వచ్చినప్పటికీ అది కలెక్షన్లుగా మారలేదు.
ఓవర్సీస్ లోనూ అద్భుతాలు జరగలేదు. పోటీని తట్టుకోలేక చరణ్ మూవీ ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు హెచ్డి పైరసీ బయటికి రావడంతో నేరుగా నిర్మాణ సంస్థ బరిలో దిగి పోలీస్ కంప్లయింట్ దాకా వెళ్లాల్సి వచ్చింది.
దీని సంగతలా ఉంచితే ఇప్పుడీ పరిణామాలు ఇండియన్ 3కు ఎంతమేరకు సానుకూలంగా ఉంటాయనేది అనుమానమే. అసలే రెండో భాగం దారుణంగా విఫలమైంది. గేమ్ ఛేంజర్ దానికన్నా చాలా మెరుగ్గా ఉన్నా కమర్షియల్ గా ప్రూవ్ చేస్తోందో లేదో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లోనూ దర్శకుడు శంకర్ ఏకంగా మూడు భాగాల వేల్పరి గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
పలు ఇంటర్వ్యూలలో నొక్కి చెబుతున్నారు. నిర్మాత ఎవరనేది చెప్పడం లేదు కానీ అది కూడా వందల కోట్లతో ముడిపడిన ప్యాన్ ఇండియా మూవీ. చాలా పెద్ద క్యాస్టింగ్ డిమాండ్ చేసే ఆ సినిమా పొన్నియిన్ సెల్వన్ ని మించి ఉంటుంది.
ఇంకొద్దిరోజులు ఆగితే భారతీయుడు 3కి సంబంధించి అసలేం జరుగుతోందనేది బయటికి వస్తుంది. శంకర్ మాత్రం థియేట్రికల్ రిలీజని నొక్కి చెబుతున్నా అదెంత వరకు కార్యాచరణలోకి వస్తుందో చెప్పలేం. ఇప్పటికైతే దాని మీద బజ్ తేవడం కష్టమే.
ఒకవేళ తగ్ లైఫ్ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు కమల్ హాసన్ ఇమేజ్ మీద మార్కెట్ చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ సోలోగా శంకర్ బ్రాండ్ మీద అమ్మడం సులభంగా ఉండదు. ఒకపక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లైకా ప్రొడక్షన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కొసమెరుపు ఏంటంటే ఇంకొంత భాగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉందట.
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…