Political News

పెంచలయ్య మహా ముదురు… ఇన్ని సార్లా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పరకామణిలో వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన పెంచలయ్య వ్యవహారంలో షాకింగ్ నిజాలు వెలుగు చేశాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య కాంట్రాక్టు ఉద్యోగిగా గడిచిన రెండేళ్లుగా పని చేస్తున్నాడు.

అర్గోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న అతను ఈజీగా డబ్బులు సంపాదించే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా పరకామణిలో బంగారాన్ని దాచి ఉంచే బంగారు ఆభరణాల్ని తస్కరించే పని షురూ చేశాడు. ఇతగాడి తీరులో సందేహాలు రావటంతో.. విజిలెన్స్ అధికారులు అతడిపై నిఘా పెట్టారు.

జనవరి 11న ఎప్పటిలానే విధుల్లోకి వచ్చిన అతను.. బంగారాన్ని దాచి ఉంచే గదిలో 100 గ్రాముల బిస్కెట్ ను దొంగలించి.. ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచి పెట్టాడు. తనిఖీ చేస్తున్న సిబ్బంది అతడి చోర కళను పట్టేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.

అతడు గతంలో చేసిన చోరీల జాబితా బయటకు వచ్చింది. ఇప్పటివరకు అతను 55 గ్రాముల బంగారు బిస్కెట్లను.. 100 గ్రాముల ఆభరణాల్ని.. 157 గ్రాముల వెండి వస్తువుల్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు అతను చోరీ చేసిన ఆభరణాల విలువ రూ.46 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

ఇంతకాలంగా పెంచలయ్య చోరీ చేస్తున్నా.. గుర్తించాల్సిన వ్యవస్థలు నిద్రపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది.

This post was last modified on January 14, 2025 2:08 pm

Share

Recent Posts

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

1 hour ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

3 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

3 hours ago

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

3 hours ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

4 hours ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

5 hours ago