Political News

పెంచలయ్య మహా ముదురు… ఇన్ని సార్లా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పరకామణిలో వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన పెంచలయ్య వ్యవహారంలో షాకింగ్ నిజాలు వెలుగు చేశాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య కాంట్రాక్టు ఉద్యోగిగా గడిచిన రెండేళ్లుగా పని చేస్తున్నాడు.

అర్గోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న అతను ఈజీగా డబ్బులు సంపాదించే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా పరకామణిలో బంగారాన్ని దాచి ఉంచే బంగారు ఆభరణాల్ని తస్కరించే పని షురూ చేశాడు. ఇతగాడి తీరులో సందేహాలు రావటంతో.. విజిలెన్స్ అధికారులు అతడిపై నిఘా పెట్టారు.

జనవరి 11న ఎప్పటిలానే విధుల్లోకి వచ్చిన అతను.. బంగారాన్ని దాచి ఉంచే గదిలో 100 గ్రాముల బిస్కెట్ ను దొంగలించి.. ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచి పెట్టాడు. తనిఖీ చేస్తున్న సిబ్బంది అతడి చోర కళను పట్టేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.

అతడు గతంలో చేసిన చోరీల జాబితా బయటకు వచ్చింది. ఇప్పటివరకు అతను 55 గ్రాముల బంగారు బిస్కెట్లను.. 100 గ్రాముల ఆభరణాల్ని.. 157 గ్రాముల వెండి వస్తువుల్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు అతను చోరీ చేసిన ఆభరణాల విలువ రూ.46 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

ఇంతకాలంగా పెంచలయ్య చోరీ చేస్తున్నా.. గుర్తించాల్సిన వ్యవస్థలు నిద్రపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది.

This post was last modified on January 14, 2025 2:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

41 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago