తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పరకామణిలో వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన పెంచలయ్య వ్యవహారంలో షాకింగ్ నిజాలు వెలుగు చేశాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య కాంట్రాక్టు ఉద్యోగిగా గడిచిన రెండేళ్లుగా పని చేస్తున్నాడు.
అర్గోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న అతను ఈజీగా డబ్బులు సంపాదించే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా పరకామణిలో బంగారాన్ని దాచి ఉంచే బంగారు ఆభరణాల్ని తస్కరించే పని షురూ చేశాడు. ఇతగాడి తీరులో సందేహాలు రావటంతో.. విజిలెన్స్ అధికారులు అతడిపై నిఘా పెట్టారు.
జనవరి 11న ఎప్పటిలానే విధుల్లోకి వచ్చిన అతను.. బంగారాన్ని దాచి ఉంచే గదిలో 100 గ్రాముల బిస్కెట్ ను దొంగలించి.. ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచి పెట్టాడు. తనిఖీ చేస్తున్న సిబ్బంది అతడి చోర కళను పట్టేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.
అతడు గతంలో చేసిన చోరీల జాబితా బయటకు వచ్చింది. ఇప్పటివరకు అతను 55 గ్రాముల బంగారు బిస్కెట్లను.. 100 గ్రాముల ఆభరణాల్ని.. 157 గ్రాముల వెండి వస్తువుల్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు అతను చోరీ చేసిన ఆభరణాల విలువ రూ.46 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఇంతకాలంగా పెంచలయ్య చోరీ చేస్తున్నా.. గుర్తించాల్సిన వ్యవస్థలు నిద్రపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…