లాక్డౌన్కి ముందు సమంత అంగీకరించిన చిత్రాల్లో ఒకటి అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో బైలింగ్వల్. ఆ చిత్రంలో సమంత ‘మ్యూట్’ క్యారెక్టర్ చేయనుందని వార్తలు కూడా వచ్చాయి. తాప్సీతో ‘గేమ్ ఓవర్’, నయనతారతో ‘మాయ’ చిత్రాలు చేసిన అశ్విన్ డైరెక్షన్లో హీరోయిన్ ప్రధాన చిత్రం చేయడానికి సమంత ఎక్సయిట్ అయింది.
నటిగా తన ఖ్యాతిని మరింత పెంచే పాత్రలు మాత్రమే పోషించాలని నిర్ణయించుకున్న తర్వాత సమంత ఒప్పుకునే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆమె చాలా సెలక్టివ్ అయిపోయిన తర్వాత ఎంచుకున్న ఈ ప్రాజెక్ట్ లాక్డౌన్ టైమ్లో డ్రాప్ అయినట్టు తెలిసింది. సమంత ఈ చిత్రం వద్దనుకోవడానికి కారణాలు ఏమిటనేది క్లియర్గా తెలియకపోయినా కానీ అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ రిజల్ట్ చూసిన తర్వాత సమంత మనసు మార్చుకుందనే టాక్ వినిపిస్తోంది.
నిశ్శబ్దంలో అనుష్క చేసిన పాత్రకు దగ్గరగా వుండడమే కాకుండా కథ కూడా ఇంచుమించు అదే విధంగా అనిపించడంతో సమంత ఈ చిత్రం డ్రాప్ అయిందని, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా డ్రాప్ చేసుకుని అశ్విన్ కొత్త కథతో తాప్సీని అప్రోచ్ అయ్యాడని సమాచారం. లాక్డౌన్ తర్వాత అక్కినేని హీరోలందరూ తిరిగి సెట్స్కి వెళ్లిపోయారు కానీ సమంత మాత్రం ఇంకా డాబా గార్డెన్, యోగా సెషన్స్ వదిలి బయటకు అడుగు పెట్టనే లేదసలు.
This post was last modified on October 14, 2020 12:09 pm
వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా…
తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీ.జోసెఫ్ విజయ్ అను నాను..…
ఇప్పటి హీరోల్లో వచ్చామా నటించామా వెళ్లిపోయామా అనుకునే వాళ్లు తక్కువమంది. కథా చర్చల్లో భాగమవుతున్నారు. స్క్రిప్టులు రాస్తున్నారు. దర్శకత్వం కూడా…
తమిళేనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్న స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అదినేత జోసెఫ్ విజయ్ కి…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి…
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…