లాక్డౌన్కి ముందు సమంత అంగీకరించిన చిత్రాల్లో ఒకటి అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో బైలింగ్వల్. ఆ చిత్రంలో సమంత ‘మ్యూట్’ క్యారెక్టర్ చేయనుందని వార్తలు కూడా వచ్చాయి. తాప్సీతో ‘గేమ్ ఓవర్’, నయనతారతో ‘మాయ’ చిత్రాలు చేసిన అశ్విన్ డైరెక్షన్లో హీరోయిన్ ప్రధాన చిత్రం చేయడానికి సమంత ఎక్సయిట్ అయింది.
నటిగా తన ఖ్యాతిని మరింత పెంచే పాత్రలు మాత్రమే పోషించాలని నిర్ణయించుకున్న తర్వాత సమంత ఒప్పుకునే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆమె చాలా సెలక్టివ్ అయిపోయిన తర్వాత ఎంచుకున్న ఈ ప్రాజెక్ట్ లాక్డౌన్ టైమ్లో డ్రాప్ అయినట్టు తెలిసింది. సమంత ఈ చిత్రం వద్దనుకోవడానికి కారణాలు ఏమిటనేది క్లియర్గా తెలియకపోయినా కానీ అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ రిజల్ట్ చూసిన తర్వాత సమంత మనసు మార్చుకుందనే టాక్ వినిపిస్తోంది.
నిశ్శబ్దంలో అనుష్క చేసిన పాత్రకు దగ్గరగా వుండడమే కాకుండా కథ కూడా ఇంచుమించు అదే విధంగా అనిపించడంతో సమంత ఈ చిత్రం డ్రాప్ అయిందని, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా డ్రాప్ చేసుకుని అశ్విన్ కొత్త కథతో తాప్సీని అప్రోచ్ అయ్యాడని సమాచారం. లాక్డౌన్ తర్వాత అక్కినేని హీరోలందరూ తిరిగి సెట్స్కి వెళ్లిపోయారు కానీ సమంత మాత్రం ఇంకా డాబా గార్డెన్, యోగా సెషన్స్ వదిలి బయటకు అడుగు పెట్టనే లేదసలు.
This post was last modified on October 14, 2020 12:09 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…