Movie News

నిశ్శబ్దం రిజల్ట్ తో సమంత డ్రాప్‍?

లాక్‍డౌన్‍కి ముందు సమంత అంగీకరించిన చిత్రాల్లో ఒకటి అశ్విన్‍ శరవణన్‍ దర్శకత్వంలో బైలింగ్వల్‍. ఆ చిత్రంలో సమంత ‘మ్యూట్‍’ క్యారెక్టర్‍ చేయనుందని వార్తలు కూడా వచ్చాయి. తాప్సీతో ‘గేమ్‍ ఓవర్‍’, నయనతారతో ‘మాయ’ చిత్రాలు చేసిన అశ్విన్‍ డైరెక్షన్‍లో హీరోయిన్‍ ప్రధాన చిత్రం చేయడానికి సమంత ఎక్సయిట్‍ అయింది.

నటిగా తన ఖ్యాతిని మరింత పెంచే పాత్రలు మాత్రమే పోషించాలని నిర్ణయించుకున్న తర్వాత సమంత ఒప్పుకునే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆమె చాలా సెలక్టివ్‍ అయిపోయిన తర్వాత ఎంచుకున్న ఈ ప్రాజెక్ట్ లాక్‍డౌన్‍ టైమ్‍లో డ్రాప్‍ అయినట్టు తెలిసింది. సమంత ఈ చిత్రం వద్దనుకోవడానికి కారణాలు ఏమిటనేది క్లియర్‍గా తెలియకపోయినా కానీ అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ రిజల్ట్ చూసిన తర్వాత సమంత మనసు మార్చుకుందనే టాక్‍ వినిపిస్తోంది.

నిశ్శబ్దంలో అనుష్క చేసిన పాత్రకు దగ్గరగా వుండడమే కాకుండా కథ కూడా ఇంచుమించు అదే విధంగా అనిపించడంతో సమంత ఈ చిత్రం డ్రాప్‍ అయిందని, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా డ్రాప్‍ చేసుకుని అశ్విన్‍ కొత్త కథతో తాప్సీని అప్రోచ్‍ అయ్యాడని సమాచారం. లాక్‍డౌన్‍ తర్వాత అక్కినేని హీరోలందరూ తిరిగి సెట్స్కి వెళ్లిపోయారు కానీ సమంత మాత్రం ఇంకా డాబా గార్డెన్‍, యోగా సెషన్స్ వదిలి బయటకు అడుగు పెట్టనే లేదసలు.

This post was last modified on October 14, 2020 12:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

40 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago