లాక్డౌన్కి ముందు సమంత అంగీకరించిన చిత్రాల్లో ఒకటి అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో బైలింగ్వల్. ఆ చిత్రంలో సమంత ‘మ్యూట్’ క్యారెక్టర్ చేయనుందని వార్తలు కూడా వచ్చాయి. తాప్సీతో ‘గేమ్ ఓవర్’, నయనతారతో ‘మాయ’ చిత్రాలు చేసిన అశ్విన్ డైరెక్షన్లో హీరోయిన్ ప్రధాన చిత్రం చేయడానికి సమంత ఎక్సయిట్ అయింది.
నటిగా తన ఖ్యాతిని మరింత పెంచే పాత్రలు మాత్రమే పోషించాలని నిర్ణయించుకున్న తర్వాత సమంత ఒప్పుకునే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆమె చాలా సెలక్టివ్ అయిపోయిన తర్వాత ఎంచుకున్న ఈ ప్రాజెక్ట్ లాక్డౌన్ టైమ్లో డ్రాప్ అయినట్టు తెలిసింది. సమంత ఈ చిత్రం వద్దనుకోవడానికి కారణాలు ఏమిటనేది క్లియర్గా తెలియకపోయినా కానీ అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ రిజల్ట్ చూసిన తర్వాత సమంత మనసు మార్చుకుందనే టాక్ వినిపిస్తోంది.
నిశ్శబ్దంలో అనుష్క చేసిన పాత్రకు దగ్గరగా వుండడమే కాకుండా కథ కూడా ఇంచుమించు అదే విధంగా అనిపించడంతో సమంత ఈ చిత్రం డ్రాప్ అయిందని, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా డ్రాప్ చేసుకుని అశ్విన్ కొత్త కథతో తాప్సీని అప్రోచ్ అయ్యాడని సమాచారం. లాక్డౌన్ తర్వాత అక్కినేని హీరోలందరూ తిరిగి సెట్స్కి వెళ్లిపోయారు కానీ సమంత మాత్రం ఇంకా డాబా గార్డెన్, యోగా సెషన్స్ వదిలి బయటకు అడుగు పెట్టనే లేదసలు.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…