లాక్డౌన్కి ముందు సమంత అంగీకరించిన చిత్రాల్లో ఒకటి అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో బైలింగ్వల్. ఆ చిత్రంలో సమంత ‘మ్యూట్’ క్యారెక్టర్ చేయనుందని వార్తలు కూడా వచ్చాయి. తాప్సీతో ‘గేమ్ ఓవర్’, నయనతారతో ‘మాయ’ చిత్రాలు చేసిన అశ్విన్ డైరెక్షన్లో హీరోయిన్ ప్రధాన చిత్రం చేయడానికి సమంత ఎక్సయిట్ అయింది.
నటిగా తన ఖ్యాతిని మరింత పెంచే పాత్రలు మాత్రమే పోషించాలని నిర్ణయించుకున్న తర్వాత సమంత ఒప్పుకునే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆమె చాలా సెలక్టివ్ అయిపోయిన తర్వాత ఎంచుకున్న ఈ ప్రాజెక్ట్ లాక్డౌన్ టైమ్లో డ్రాప్ అయినట్టు తెలిసింది. సమంత ఈ చిత్రం వద్దనుకోవడానికి కారణాలు ఏమిటనేది క్లియర్గా తెలియకపోయినా కానీ అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ రిజల్ట్ చూసిన తర్వాత సమంత మనసు మార్చుకుందనే టాక్ వినిపిస్తోంది.
నిశ్శబ్దంలో అనుష్క చేసిన పాత్రకు దగ్గరగా వుండడమే కాకుండా కథ కూడా ఇంచుమించు అదే విధంగా అనిపించడంతో సమంత ఈ చిత్రం డ్రాప్ అయిందని, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా డ్రాప్ చేసుకుని అశ్విన్ కొత్త కథతో తాప్సీని అప్రోచ్ అయ్యాడని సమాచారం. లాక్డౌన్ తర్వాత అక్కినేని హీరోలందరూ తిరిగి సెట్స్కి వెళ్లిపోయారు కానీ సమంత మాత్రం ఇంకా డాబా గార్డెన్, యోగా సెషన్స్ వదిలి బయటకు అడుగు పెట్టనే లేదసలు.
This post was last modified on October 14, 2020 12:09 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…