ప్రతి సంవత్సరం జపాన్లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల మార్కెట్లో అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేప కలకలం రేపింది. 276 కిలోల బరువు గల ఈ చేప మార్కెట్లో వేలానికి వెళ్లగా, భారీ ధరకు అమ్ముడైంది. ఒనోడెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ చేప కోసం ఏకంగా రూ.11 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు.
జపనీయుల నమ్మకం ప్రకారం, కొత్త సంవత్సరం ప్రారంభంలో ట్యూనా చేపను పొందడం అదృష్ట సూచికగా భావిస్తారు. దీనివల్ల ఆ ఏడాది సంపద, శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు. దీంతో ఈ చేపను పొందేందుకు మార్కెట్లో ఉన్న రెస్టారెంట్లు పోటీ పడ్డాయి. చివరికి ఒనోడెరా సంస్థ అధిక ధరకు ఈ చేపను దక్కించుకుంది. తమ వినియోగదారులకు అత్యుత్తమమైన సుషీ అనుభవం అందించడమే కాకుండా, అదృష్టాన్ని కూడా పంచాలని సంస్థ ప్రకటించింది.
ఇంతటి ధరకు చేప అమ్ముడవడం సర్వసాధారణం కాదు. 1999 నుంచి చేపల మార్కెట్లో అత్యధిక ధరకు అమ్ముడైన చేపల రికార్డులను పరిశీలిస్తే, 2019లో 278 కిలోల బరువుగల ట్యూనా చేప రూ.18 కోట్లు పలకడం గమనార్హం. ఈ రికార్డు ఇప్పటికీ బ్రేక్ కాకపోయినా, ఈ ఏడాది రూ.11 కోట్లకు ట్యూనా చేప అమ్ముడవడం రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా, గతేడాది కూడా ట్యూనా చేప కోసం ఒనోడెరా సంస్థ 114 మిలియన్ యెన్లను చెల్లించిన విషయం తెలిసిందే.
ఈ అరుదైన చేప ఖరీదుతో పాటు, జపనీయుల నమ్మకాలు వారి ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ‘‘ఈ చేప మా రెస్టారెంట్ కస్టమర్లకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 2025ను అందరికీ శుభవత్సరంగా మార్చడంలో భాగస్వామ్యం కావడంలో గర్విస్తున్నాం,’’ అని ఒనోడెరా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ చేప కొనుగోలు వెనుక ఉన్న ప్రాముఖ్యత సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
This post was last modified on January 6, 2025 9:57 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…