Trends

ఆ ఒక్క చేప ఖరీదు 11 కోట్లు!

ప్రతి సంవత్సరం జపాన్‌లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల మార్కెట్‌లో అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేప కలకలం రేపింది. 276 కిలోల బరువు గల ఈ చేప మార్కెట్‌లో వేలానికి వెళ్లగా, భారీ ధరకు అమ్ముడైంది. ఒనోడెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్‌ నిర్వాహకులు ఈ చేప కోసం ఏకంగా రూ.11 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు.

జపనీయుల నమ్మకం ప్రకారం, కొత్త సంవత్సరం ప్రారంభంలో ట్యూనా చేపను పొందడం అదృష్ట సూచికగా భావిస్తారు. దీనివల్ల ఆ ఏడాది సంపద, శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు. దీంతో ఈ చేపను పొందేందుకు మార్కెట్‌లో ఉన్న రెస్టారెంట్లు పోటీ పడ్డాయి. చివరికి ఒనోడెరా సంస్థ అధిక ధరకు ఈ చేపను దక్కించుకుంది. తమ వినియోగదారులకు అత్యుత్తమమైన సుషీ అనుభవం అందించడమే కాకుండా, అదృష్టాన్ని కూడా పంచాలని సంస్థ ప్రకటించింది.

ఇంతటి ధరకు చేప అమ్ముడవడం సర్వసాధారణం కాదు. 1999 నుంచి చేపల మార్కెట్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన చేపల రికార్డులను పరిశీలిస్తే, 2019లో 278 కిలోల బరువుగల ట్యూనా చేప రూ.18 కోట్లు పలకడం గమనార్హం. ఈ రికార్డు ఇప్పటికీ బ్రేక్ కాకపోయినా, ఈ ఏడాది రూ.11 కోట్లకు ట్యూనా చేప అమ్ముడవడం రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా, గతేడాది కూడా ట్యూనా చేప కోసం ఒనోడెరా సంస్థ 114 మిలియన్ యెన్‌లను చెల్లించిన విషయం తెలిసిందే.

ఈ అరుదైన చేప ఖరీదుతో పాటు, జపనీయుల నమ్మకాలు వారి ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ‘‘ఈ చేప మా రెస్టారెంట్ కస్టమర్లకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 2025ను అందరికీ శుభవత్సరంగా మార్చడంలో భాగస్వామ్యం కావడంలో గర్విస్తున్నాం,’’ అని ఒనోడెరా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ చేప కొనుగోలు వెనుక ఉన్న ప్రాముఖ్యత సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.

This post was last modified on January 6, 2025 9:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

50 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago