ప్రతి సంవత్సరం జపాన్లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల మార్కెట్లో అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేప కలకలం రేపింది. 276 కిలోల బరువు గల ఈ చేప మార్కెట్లో వేలానికి వెళ్లగా, భారీ ధరకు అమ్ముడైంది. ఒనోడెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ చేప కోసం ఏకంగా రూ.11 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు.
జపనీయుల నమ్మకం ప్రకారం, కొత్త సంవత్సరం ప్రారంభంలో ట్యూనా చేపను పొందడం అదృష్ట సూచికగా భావిస్తారు. దీనివల్ల ఆ ఏడాది సంపద, శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు. దీంతో ఈ చేపను పొందేందుకు మార్కెట్లో ఉన్న రెస్టారెంట్లు పోటీ పడ్డాయి. చివరికి ఒనోడెరా సంస్థ అధిక ధరకు ఈ చేపను దక్కించుకుంది. తమ వినియోగదారులకు అత్యుత్తమమైన సుషీ అనుభవం అందించడమే కాకుండా, అదృష్టాన్ని కూడా పంచాలని సంస్థ ప్రకటించింది.
ఇంతటి ధరకు చేప అమ్ముడవడం సర్వసాధారణం కాదు. 1999 నుంచి చేపల మార్కెట్లో అత్యధిక ధరకు అమ్ముడైన చేపల రికార్డులను పరిశీలిస్తే, 2019లో 278 కిలోల బరువుగల ట్యూనా చేప రూ.18 కోట్లు పలకడం గమనార్హం. ఈ రికార్డు ఇప్పటికీ బ్రేక్ కాకపోయినా, ఈ ఏడాది రూ.11 కోట్లకు ట్యూనా చేప అమ్ముడవడం రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా, గతేడాది కూడా ట్యూనా చేప కోసం ఒనోడెరా సంస్థ 114 మిలియన్ యెన్లను చెల్లించిన విషయం తెలిసిందే.
ఈ అరుదైన చేప ఖరీదుతో పాటు, జపనీయుల నమ్మకాలు వారి ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ‘‘ఈ చేప మా రెస్టారెంట్ కస్టమర్లకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 2025ను అందరికీ శుభవత్సరంగా మార్చడంలో భాగస్వామ్యం కావడంలో గర్విస్తున్నాం,’’ అని ఒనోడెరా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ చేప కొనుగోలు వెనుక ఉన్న ప్రాముఖ్యత సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
This post was last modified on January 6, 2025 9:57 am
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…