ప్రతి సంవత్సరం జపాన్లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల మార్కెట్లో అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేప కలకలం రేపింది. 276 కిలోల బరువు గల ఈ చేప మార్కెట్లో వేలానికి వెళ్లగా, భారీ ధరకు అమ్ముడైంది. ఒనోడెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ చేప కోసం ఏకంగా రూ.11 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు.
జపనీయుల నమ్మకం ప్రకారం, కొత్త సంవత్సరం ప్రారంభంలో ట్యూనా చేపను పొందడం అదృష్ట సూచికగా భావిస్తారు. దీనివల్ల ఆ ఏడాది సంపద, శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు. దీంతో ఈ చేపను పొందేందుకు మార్కెట్లో ఉన్న రెస్టారెంట్లు పోటీ పడ్డాయి. చివరికి ఒనోడెరా సంస్థ అధిక ధరకు ఈ చేపను దక్కించుకుంది. తమ వినియోగదారులకు అత్యుత్తమమైన సుషీ అనుభవం అందించడమే కాకుండా, అదృష్టాన్ని కూడా పంచాలని సంస్థ ప్రకటించింది.
ఇంతటి ధరకు చేప అమ్ముడవడం సర్వసాధారణం కాదు. 1999 నుంచి చేపల మార్కెట్లో అత్యధిక ధరకు అమ్ముడైన చేపల రికార్డులను పరిశీలిస్తే, 2019లో 278 కిలోల బరువుగల ట్యూనా చేప రూ.18 కోట్లు పలకడం గమనార్హం. ఈ రికార్డు ఇప్పటికీ బ్రేక్ కాకపోయినా, ఈ ఏడాది రూ.11 కోట్లకు ట్యూనా చేప అమ్ముడవడం రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా, గతేడాది కూడా ట్యూనా చేప కోసం ఒనోడెరా సంస్థ 114 మిలియన్ యెన్లను చెల్లించిన విషయం తెలిసిందే.
ఈ అరుదైన చేప ఖరీదుతో పాటు, జపనీయుల నమ్మకాలు వారి ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ‘‘ఈ చేప మా రెస్టారెంట్ కస్టమర్లకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 2025ను అందరికీ శుభవత్సరంగా మార్చడంలో భాగస్వామ్యం కావడంలో గర్విస్తున్నాం,’’ అని ఒనోడెరా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ చేప కొనుగోలు వెనుక ఉన్న ప్రాముఖ్యత సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
This post was last modified on January 6, 2025 9:57 am
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…