ప్రతి సంవత్సరం జపాన్లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల మార్కెట్లో అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేప కలకలం రేపింది. 276 కిలోల బరువు గల ఈ చేప మార్కెట్లో వేలానికి వెళ్లగా, భారీ ధరకు అమ్ముడైంది. ఒనోడెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ చేప కోసం ఏకంగా రూ.11 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు.
జపనీయుల నమ్మకం ప్రకారం, కొత్త సంవత్సరం ప్రారంభంలో ట్యూనా చేపను పొందడం అదృష్ట సూచికగా భావిస్తారు. దీనివల్ల ఆ ఏడాది సంపద, శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు. దీంతో ఈ చేపను పొందేందుకు మార్కెట్లో ఉన్న రెస్టారెంట్లు పోటీ పడ్డాయి. చివరికి ఒనోడెరా సంస్థ అధిక ధరకు ఈ చేపను దక్కించుకుంది. తమ వినియోగదారులకు అత్యుత్తమమైన సుషీ అనుభవం అందించడమే కాకుండా, అదృష్టాన్ని కూడా పంచాలని సంస్థ ప్రకటించింది.
ఇంతటి ధరకు చేప అమ్ముడవడం సర్వసాధారణం కాదు. 1999 నుంచి చేపల మార్కెట్లో అత్యధిక ధరకు అమ్ముడైన చేపల రికార్డులను పరిశీలిస్తే, 2019లో 278 కిలోల బరువుగల ట్యూనా చేప రూ.18 కోట్లు పలకడం గమనార్హం. ఈ రికార్డు ఇప్పటికీ బ్రేక్ కాకపోయినా, ఈ ఏడాది రూ.11 కోట్లకు ట్యూనా చేప అమ్ముడవడం రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా, గతేడాది కూడా ట్యూనా చేప కోసం ఒనోడెరా సంస్థ 114 మిలియన్ యెన్లను చెల్లించిన విషయం తెలిసిందే.
ఈ అరుదైన చేప ఖరీదుతో పాటు, జపనీయుల నమ్మకాలు వారి ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ‘‘ఈ చేప మా రెస్టారెంట్ కస్టమర్లకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 2025ను అందరికీ శుభవత్సరంగా మార్చడంలో భాగస్వామ్యం కావడంలో గర్విస్తున్నాం,’’ అని ఒనోడెరా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ చేప కొనుగోలు వెనుక ఉన్న ప్రాముఖ్యత సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…